సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వాల్యూస్తో నిర్మించిన ఈ చిత్రంలో నయనతార, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటించారు. రజినీ మరియు మురుగదాస్ ల కాంబోలో మొట్టమొదటి సారి తెరకెక్కిన చిత్రం కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా మంచి బజ్ ఏర్పండింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఈరోజు నాలుగు భాషల్లో విడుదల అయ్యింది. ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. 70 ఏళ్ల వయసులో కూడా సూపర్ ఎనర్జిటిక్ రోల్ చేసాడు సూపర్ స్టార్.
తమిళనాట దర్బార్ సినిమా చూసి రజనీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అక్కడ పొంగల్కు పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో రజనీ బ్లాక్బస్టర్ ఖాయం అంటున్నారు. వాస్తవానికి ముందు నుంచి పెద్దగా అంచనాలు లేకపోయినా కూడా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇక కథ వెళ్లినట్టయితే ఆదిత్య అరుణాచలం(రజినీకాంత్) మాంచి యాటిట్యూడిక్ పోలీస్ ఆఫీసర్. ఢిల్లీ నుంచి ముంబైకి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాడు. ఇదే నేపథ్యంలో విలన్ హరి చోప్రా(సునీల్ శెట్టి) డాన్ గా ఒక మాఫియాను నడిపిస్తుంటాడు. ఇక వీరిద్దరికి సంబంధం ఏంటి..? అన్నదే కథ.
ఇక సినిమా అన్నాక ప్లస్లు.. మైనస్లు ఉండడం సహజం. మరి రజినీకాంత్ దర్బార్ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్ వన్ మ్యాన్ షో, మురుగదాస్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్, బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి విలనిజం, కొన్ని ఎలివేషన్ సీన్స్ మరియు నయనతారతో కెమిస్టీ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అలాగే రొటీన్ స్టోరీ, అంత ఆసక్తిగా సాగని స్క్రీన్ ప్లే మరియు మురుగదాస్ మార్క్ మిసింగ్ సినిమాకు మైనస్లుగా మారాయి. ఏదేమైనా టాక్ పరంగా చూస్తే.. రజినీ ఖాతాలో మరో హిట్ పడనున్నట్టు తెలుస్తోంది. అలాగే బ్యాడ్ పోలీస్ ఆఫీసర్గా రజినీకాంత్ నటన మాస్ ఆడియన్స్కు ఫుల్ మీల్స్ పెట్టేసిందని టాక్ వినిపిస్తోంది.