తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్గెస్ట్ కామెడీ షో జబర్ధస్త్.  ఏడేళ్ల క్రితం మొదలైన జబర్ధస్త్ కామెడీ షో ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్కిట్స్ తో బుల్లితెర అభిమానులను ఆకర్షిస్తుంది.  ఇందులో నటులు ప్రస్తుతం సినిమాల్లో కూడా మంచి ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఈ షోని బీట్ చేయాలని ఎన్ని షోలు వస్తున్నా.. దీని ముందు నిలబడలేకపోతున్నాయి.  ఇక శకలక శంకర్, సుడిగాలి సుధీర్ లాంటివాళ్లు అయితే ఏకంగా హీరోలుగా వస్తున్నారు.  మొత్తానికి జబర్ధస్త్ పుణ్యమా అని ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు ఇప్పుడు మంచి పొజీషన్ కి రావడమే కాదు సెటిల్ కూడా అవుతున్నారు.  ఇక బుల్లెట్ భాస్కర్ స్కిట్ తో పరిచయం అయిన నరేష్ ఉన్నది మూడు అడుగేలే కానీ.. టాలెంట్ లో అందరినీ మించిపోయాడు.  ఎవరి స్కిట్ లో వచ్చినా నరేష్ తన టాలెంట్ చూపిస్తు అందరినీ ఆకర్షిస్తున్నాడు.

 

 తాజాగా ఇప్పుడు నరేష్ పై ఎమ్మెల్యే, నటి జబర్ధస్తో జడ్జీ రోజా సీరియస్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ మద్య నరేష్ సైతం సినిమాల్లో కనిపిస్తున్నాడు. దాంతో నరేష్ కి ఇటు జబర్ధస్త్.. అటు సినిమాల్లో మంచి క్రేజ్ వచ్చింది.   బుల్లితెరపై అతడికి మంచి డిమాండ్ ఉంది.'జబర్దస్త్' షోతో పాటు మరికొన్ని షోలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. తాజాగా సంక్రాంతికి రాబోయే ఓ షోకి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.  అయితే ఈ కార్యక్రమంలో పిల్లలను.. పెద్దలన సపరేట్ గ్రూప్ గా విభిజించి కామెడీ పండించారు.  ఈ కార్యక్రమానికి ప్రదీప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

 

రోజాతో సహా పలువురు యాంకర్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్ లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నరేష్ ''కళ్లు పెద్దవి చేసి చూస్తే ఎవరూ భయపడరిక్కడ'' అంటూ ఓ డైలాగ్ చెప్పాడు. అప్పట్లో ఏపి అసెంబ్లీలో బాబు ని చూస్తూ సీఎం జగన్ కొట్టిన డైలాగ్.. నరేష్ తనదైన కామెడీతో కొట్టడం అక్కడ ఉన్నవారంతా నవ్వారు.  ఇదే డైలాగ్ నరేష్ రెండు మూడు సార్లు అనడంతో అక్కడకు వచ్చిన రోజా అతడి వంక చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్లు చూడటంతో మనోడు సైలెంట్ అయ్యాడు..దాంతో అక్కడ ఉన్నవారంతో మరోసారి నవ్వుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: