సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే సినిమాల సందడి మొదలవుతుంది. ఇక అదే విధంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా మూడు బడా సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నాయి. అందులో టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు నటించిన సరిలేరు నీకెవ్వరు అలానే, అల వైకుంఠ పురములో సినిమాలు రెండూ కేవలం ఒకే ఒక రోజు గ్యాప్ తో రిలీజ్ అవుతున్నాయి. 

 

అయితే వీటితో పాటు రిలీజ్ అవుతున్న మరో బడా సినిమా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్. మాస్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించగా ఒక కీలక పాత్రలో మరొక హీరోయిన్ నివేద థామస్ నటించడం జరిగింది. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పరవాలేదనిపించే టాక్ తో ముందుకు సాగుతోంది. నిజానికి రజినీ దర్బార్ సినిమా యొక్క ఫలితమే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాల మీద కొంతవరకు ఆధారపడి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

ఈ విధంగా ఒకరకంగా రజినీ దర్బార్ సినిమా మహేష్ బాబు, అల్లు అర్జున్ లను టెన్షన్ లో పడేసింది అనే చెప్పాలి. ఇప్పటికే 2.0 అలానే పేట సినిమాల సక్సెస్ లతో సూపర్ స్టార్ రజినీకాంత్ మంచి ఫామ్ లో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ దర్బార్ సినిమాపై ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించిన దర్బార్ సినిమా, ఎంత మేరకు మహేష్, బన్నీల సినిమాలకు చెక్ పెడుతుందో తెలియాలంటే ఇంకొంత సమయం ఆగాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: