సరిలేరు నీకెవ్వరూ.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమాలో కీలక పాత్రల్లో విజయశాంతి నటిస్తుంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో రీ ఏంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె ప్రేక్షకుల అంత ఆమె రీ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.    

 

అయితే సరిలేరు నీకెవ్వరూ.. అబ్బో ప్రేక్షకులకు భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు కాళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రేమోషన్స్ లో సరిలేరు నీకెవ్వరూ టీమ్ జోరుగా ఉంది. మొన్న ఆదివారం సరిలేరు నీకెవ్వరూ టీమ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అంత కూడా హల్ చల్ చేసింది. 

 

అయితే ఈ నేపథ్యంలోనే రష్మిక.. దేవి శ్రీ ప్రసాద్ కూడా సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇంకా ఉన్నది రెండు రోజులే కాబట్టి ప్రేమోషన్స్ భారీ స్థాయిలో చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రష్మిక.. దేవి శ్రీ ప్రసాద్ ఓ వీడియోని తీసి అది కాస్త యూట్యూబ్ లో పెట్టారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఏంటంటే.. నెవర్ బీఫారు.. నెవర్ ఆఫ్టరు అంటూ ఆ వీడియోలో రష్మిక మందాన.. దేవి శ్రీ ప్రసాద్ హల్ చల్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

                               

మరింత సమాచారం తెలుసుకోండి: