కోలీవుడ్ స్టార్ కమెడియన్స్ లో ఎక్కువగా వినిపించేది వడివేలు. ప్రభుదేవతో ప్రేమికుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన వడివేలు ఎన్నో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.  తెలుగు లో బ్రహ్మానందం ఎలాంటి ఎక్స్ ప్రేషన్ తో నవ్విస్తారో.. తమిళ్ లో వడివేలు ని చూస్తే అంతే నవ్వు వస్తుంది.  ఆయన హావభావాలు..నడక.. కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కటీ చూడగానే నవ్వు పుట్టించేలా ఉంటాయి. తాజాగా నటుడు వడివేలు పై పోలీసులకు ఫిర్యాదు చేయడం కోలీవుడు లో సంచలనం రేపుతుంది. ఆ మద్య ఓ సినిమా విషయంలో వడివేలు పై కేసు నమోదు కావడం.. కోర్టు దాకా వెళ్లడం జరిగింది.  'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి 2'  చిత్ర వివాదం వార్తల్లో బాగా నిలిచింది. శంకర్ నిర్మాతగా శింబుదేవన్ దర్శకత్వంలో వడివేలు హీరోగా నటించిన 'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి' తెలుగు లో హింసించే 23వ రాజు పులకేశి మూవీ మంచి హిట్ అయిన విషయం తెలిసిందే.  దాంతో ఈ మూవీకి సీక్వెల్ గా  'ఇంసై అరసన్ 23 ఆమ్ పులికేసి 2'   తీయడానికి సిద్దం అయ్యారు.

 

దానికోసం భారీ సెట్స్ కూడా వేశారు. అలాంటిది వడివేలు ఈ సినిమాలో నటించడానికి నిరాకరించారు. దాంతో నిర్మాత శంకర్ కి ఎంతో డబ్బు నష్టం జరిగింది.  దాంతో వడివేలు రూ.4 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ గొడవ ఇలా సాగుతూనే ఉండగా వడివేలు పై మరో కేసు నమోదు అయ్యింది. తాజాగా వడివేలు పై మధురై, పూదూర్ కి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి పుదూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సతీష్ కుమార్ పుదూర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇటీవల మణికంఠన్ అనే వ్యక్తి కొంత మంది తో కలిసి సతీష్ కుమార్ ఆఫీస్ లోకి బలవంతంగా దూరి అక్కడ గోవింద్ రాజ్ అనే వ్యక్తిపై దాడి చేశారు.అంతే కాదు తమకు డబ్బులు సెటిల్ చేయకుంటే సతీష్, గోవింద్ ని లారీతో గుద్దించి మరీ చంపేస్తామని బెదిరించారట.  

 

గతంలో వడివేలు తో సతీష్ కుమార్మూవీ తీశారు. దానికి సంబంధించి మనీ సెటిల్ మెంట్ విషయంలో మణికఠ బెదిరించినట్లు సమాచారం. అయితే మణికంఠ కమెడియన్ వడివేలు మేనేజర్ గా పనిచేస్తున్నారు. సినిమా లావేదేవీల్లో భాగంగానే వడివేలు ప్రోద్భలతంతో మణికంఠన్.. సతీష్ కుమార్ ని బెదిరించినట్లు సమాచారం.  కాగా, తన వ్యక్తిపై దాడి చేసి గాయపర్చి.. బెదిరించారని  సతీష్ కుమార్ పూదూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నటుడు వడివేలుని విచారించడానికి సిద్ధమవుతుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: