‘టాలీవుడ్ హీరోలందరం కలిసే ఉన్నాం.. అభిమానులే ఇంకా పోటీలు పడుతున్నారు.. అందరూ కలిసి ఉండండి’ ఇదీ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పిన మాట. దీనిని మహేశ్ పాటించటం లేదని.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎక్కువవుతున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తన సినిమాను ఆదరించాలని చెప్పిన మహేశ్.. మిగిలిన సంక్రాంతి సినిమాల ప్రస్తావన తేకపోవడమే ఇందుకు కారణమైంది.

 

 

నిజానికి మహేశ్ కొన్ని సినిమాలు చూస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తూంటాడు. అందులో సందేహం లేదు. కానీ.. ఈ ఫంక్షన్ లో చిరంజీవివిజయశాంతి మేనియానే హైలైట్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ కంగారు కారణమో.. మరచిపోయాడో కానీ.. సంక్రాంతికి వచ్చే మిగిలిన సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పడం మరచిపోయాడు. మరునాడు జరిగిన అల.. వైకుంఠపురంలో ఫంక్షన్ లో బన్నీ మిగిలిన సంక్రాంతి సినిమాలను ప్రస్తావించి అవి కూడా బాగా ఆడాలని కోరుకున్నాడు. ఆ మరునాడు జరిగిన ఎంత మంచివాడవురా ఫంక్షన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మిగిలిన సినిమాల ప్రస్తావన తీసుకొచ్చి బాగా ఆడాలి.. పరిశ్రమ బాగుండాలి అని విష్ చేశాడు.

 

 

ఇప్పుడు ఈ అంశాలనే నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలు మిగిలిన సినిమాలు కూడా ఆడాలని కోరుకుంటే మహేశ్ ఎందుకు ఇలా చేశాడు.. అంటూ ఫైర్ అవుతున్నారు. కానీ నెటిజన్లు.. ఆ మరునాడు జరిగిన రజినీకాంత్ దర్బార్ ఫంక్షన్ లో మిగిలిన మూడు సినిమాల ప్రస్తావనే తీసుకురాలేదు. తమిళ్ నుంచి తెలుగులోకి వస్తూ కూడా మన సినిమాలు ఆడాలని ఆయన కోరుకోలేదు. దర్బార్ గురించి మాత్రం మనవాళ్లు డబ్బా కొట్టారు. దీనిని కూడా నెటిజన్లు గమనించాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: