కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ అంటే హిట్టూ.. ఫ్లాప్ అనే తేడా లేకుండా ఆయన ఇమేజ్ తోనే మంచి కలెక్షన్లు సాధిస్తాయని అంటారు. అయితే గత కొంత కాలంగా రజినీ మానియా పెద్దగా వర్క్ ఔట్ కావడం లేదనే చెప్పాలి.  ఆ మద్య లింగా మూవీలో ద్విపాత్రాభినయంతో దుమ్మురేపాలని చూశారు.  కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో హిట్ కవాడం దేవుడెరుగు.. బయ్యర్లకు భారీగా నష్టాలు తెచ్చిపెట్టింది.  దాంతో వారంతా రజినీపై ఆగ్రహం వ్యక్తం చేయడం ఎలాగో అలా సెటిల్ మెంట్ చేశారు.   ఆ తర్వాత కబాలీ, కాలా సినిమాలు కూడా దారుణమైన డిజాస్టర్ అయ్యాయి. 

 

తాజాగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో రజినీ, నయనతార, నివేదా థామస్ నటించిన ‘దర్భార్’మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  అయితే ఈ మూవీ తమిళ నాట ఎలా ఉన్నా తెలుగు లో మాత్రం ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు. గతంలో రజినీకాంత్ బాషా, న‌ర‌సింహ్మ, అరుణాచ‌లం, లింగా అన్నీ మూవీస్ ఈ స్టైలోనే ఉన్నాయని.. ఇప్పుడు ఇదే స్టైల్ చూపించారని నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ లో రజినీపోలీస్ సింహాలా చూపించారని.. థియేటర్లో ఆ అంచనాలు అచ్చు తప్పాయని అంటున్నారు.  ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడి అనే విధంగా ఉంటున్నాయని.. ఇప్పటికైనా రజినీ కాస్త సినిమా కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు పడితే చాలా బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

 

రజినీపై ఎంతో నమ్మకంగా కామన్ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారని.. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ రొటీన్ స్టోరీలతో బోర్ కొట్టించే విధంగా సినిమాలు తీస్తున్నారని బాధ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.  పెద్ద దర్శకులతో సైతం ఇలాంటి సినిమాలు తీస్తే.. కొన్నాళ్లకు రజినీ పై పూర్తిగా విమర్శలు ఎక్కువ అవుతాయని.. ఇప్పటికైనా ఆడియన్స్ మనసు తెలుసుకొని మంచి కథనాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు.  పాత కథలకు స్వస్తి చెప్పాలని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: