టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, అనిల్ సుంకర కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి సూపర్ డూపర్ స్పీచ్ ఇచ్చి సరిలేరు నీకెవ్వరు చిత్రం యొక్క ప్రమోషన్ తారస్థాయిలో చేశారు. అదేవిధంగా కన్నడ పిల్ల రష్మిక మందాన ఎన్నడూ చూడనటువంటి క్యూట్ స్పీచ్ ని డెలివర్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమాని ఇంకా విజయవంతం చేయాలని ముందస్తుగా ఎన్నో ప్రణాళికలను చిత్ర బృందం ఏర్పాటు చేసుకుంటుంది. అందులో భాగంగా చిత్ర దర్శకుడు అనిల్ సుంకర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఒక లేఖను రాశారు.


అయితే ఆ లేఖలో ఉన్నటువంటి విన్నపాన్ని మన్నించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి కానుకగా వారి కోరుకున్న కోరికను తీరుస్తూ.. వారికి ఒక గిఫ్ట్ గా ప్రసాదిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇంతకు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం గిఫ్ట్ గా ఇచ్చారంటే... జనవరి 11 వ తారీకు నుంచి జనవరి 17 వరకు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు చిత్రం యొక్క రెండు షో లను అదనంగా వేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చారు.



ఇక ఈ నిర్ణయంతో సంక్రాంతి సందర్భంగా సినిమా ఎక్కువ ఆటలు ఆడటంతో పాటు బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్లు వసూల్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి దుమ్ము రేపినున్న ఈ చిత్రంలో ఇంకా ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెప్పుకొస్తున్నారు. ఇకపోతే, ఈ సినిమా మహేష్ బాబు సినీ కెరియర్ లో ఎటువంటి హిట్ సాధిస్తుందో చూడాలిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: