సూపర్ స్టార్ రజినీకాంత్ మురుగదాస్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా దర్బార్. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కథ కథనాలు రొటీన్ గా ఉన్నా రజిని స్టైల్ అదిరిపోయిందని అంటున్నారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేదా థామస్ స్పెషల్ రోల్ చేసింది. 

 

ఇక ఈ సినిమాలో రజిని లుక్ కేవలం తన ఫ్యాన్స్ ను అలరించేలా ఉన్నా సాధారణ ప్రేక్షకులు మాత్రం అంతగా కనెక్ట్ అవరని చెప్పొచ్చు. అయితే యాంటీ రజిని ఫాన్స్ మాత్రం రజిని ఎందుకయ్యా నీకు ఈ తిప్పలు ఎంచక్కా అమితాబ్ లా వయసుకి తగ్గ పాత్రలు చేయొచ్చుగా అంటున్నారు. అమితాబ్ సోలో హీరోగా సినిమాలు మానేసి సపోర్టింగ్ రోల్స్ వేస్తున్నారు. కాని రజిని మాత్రం 70  ఏళ్ల వయసులో కూడా దూకుడు చూపిస్తున్నాడు. రజిని ఫ్యాన్స్ వరకు ఓకే కాని మిగతా ఆడియన్స్ మాత్రం ఈయన ఇంకా సినిమాలు ఎందుకు తీస్తున్నాడు అనుకుంటున్నారు.

 

రజిని స్టయిల్ కు విజిల్స్ వేసే ఫ్యాన్స్ ఇంకా ఉన్నారు. అయితే ఈ వయసులో కథల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అయితే రజిని మాత్రం ఇంకా తను యువ హీరో లానే భావిస్తూ వారు తీసే కథలతో సినిమాలు చేస్తున్నాడు. దర్బార్ సినిమాలో అసలు మురుగదాస్ మార్క్ కనిపించలేదు అంటే రజిని ఇమేజ్ కోసం మురుగదాస్ కూడా కాంప్రమైజ్ కావాల్సి వచ్చిందని అంటున్నారు.

 

అయితే ఇదివరకు సినిమాల కన్నా దర్బార్ కొద్దిగా బెటర్ కాని రజిని మాత్రం ఇక మీదట అమితాబ్ ని ఫాలో అయితేనే బెటర్ అని అంటున్నారు. అయితే ఈ మధ్య రజిని సినిమాల స్పీడ్ కూడా పెంచారు. వరుసగా సినిమాలైతే  చేస్తున్నాడు కాని కంటెంట్ మీద మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: