సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా సినిమా దర్బార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించగా, అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని, సంతోష్ శివన్ ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. కొంత గ్యాప్ తరువాత రజినీకాంత్దర్బార్ సినిమా ద్వారా, పూర్తి స్థాయి మాస్, యాక్షన్ సినిమాలో నటించారు. రజిని సరసన నయనతార హీరోయిన్ గా నటించగా, నివేత థామస్ ఒక కీలక పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ట్రైలర్, అలానే సంగీత దర్శకుడు అనిరుద్ అందించిన సాంగ్స్ కు ప్రేక్షకులు, రజిని ఫ్యాన్స్ నుండి మంచి స్పందనను రాబట్టాయి. 

 

ఇక చాలా గ్యాప్ తరువాత రజిని తన మార్క్ స్టైల్ ,యాక్షన్ ఈ సినిమాలో చాలాబాగుందని మెజారిటీ ప్రేక్షకులు అంటున్నారు. ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రధాన సమస్యను ఈ సినిమా పాయింట్ గా ఎంచుకున్న మురుగదాస్, దానిని ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో కొంత తడబడ్డట్లు చెప్తున్నారు. ముఖ్యంగా సాంగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, రజిని స్టైల్, బ్యాక్ గ్రౌండ్ వంటివి మాత్రం సినిమాలో బాగున్నాయని అంటున్నారు. ఒక సీన్లో హీరోయిన్ న‌య‌న‌తార జాంగిగ్ చేస్తుంటే ఆమెకు లైన్ వేసేందుకు ర‌జ‌నీ వెళ‌తాడు, రండి వాళ్ల‌కంటే స్పీడ్‌గా ముందుకు వెళ్లాలంటే నా కారులో డ్రాప్ చేస్తాను అని ఆమెతో అంటాడు. 

 

నేను జాగింగ్ చేస్తున్నాను అని హీరోయిన్ అన్నా కాని, ర‌జ‌నీ పైన చెప్పుకున్న డైలాగ్ వేయడంతో హాల్ మొత్తం నవ్వులు పూస్తుంది. ఇక్క‌డ కామెడీ బాగుందని చెప్పాలి. అయితే ఈ సీన్ తో న‌య‌న‌తార ఒక్క‌సారిగా షాక్ అవుతుంది, ఇక ఇదంతా కూడా ప‌క్క‌నే ఉండి చూస్తోన్న ర‌జ‌నీ కుమార్తె నివేధా థామ‌స్ సైతం అవాక్క‌వుతుంది. ఈ విధంగా కొన్ని సీన్స్ సినిమాలో బాగున్నట్లు సమాచారం. అయితే ఓవర్ ఆల్ గా మాత్రం సినిమా యావరేజ్ అని అంటున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ రాబడుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: