కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లు లేక సతమతం అవుతున్న కోలీవుడ్ తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ కు, ఇటీవల ఆయన నటించిన 2.0, పేట సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగానే టాక్ మరియు కలెక్షన్ సంపాదించినప్పటికీ, ఫ్యాన్స్ మరియు సాధారణ ప్రేక్షకులు ఆశించిన రేంజ్ లో విజయాలు మాత్రం అందుకోలేదనే చెప్పాలి. దానితో కొంత ఆలోచనలో పడ్డ తలైవా, ఎట్టకేలకు యువ సంచలన దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కు తన తదుపరి సినిమా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా దర్బార్. నేడు ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై ఓవర్ ఆల్ గా మిశ్రమ స్పందన లభిస్తున్నట్లు సమాచారం. 

 

రజినీకాంత్ చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించగా, ఈ సినిమాను దర్శకుడు మురుగదాస్ మంచి మెసేజ్ తో తెరకెక్కించారు. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య క్యారెక్టర్ లో నటించింది. రజిని, మురుగ కాంబినేషన్లో ఫ్యాన్స్ ఎప్పటినుండో ఒక సినిమా కోసం ఎదురు చూడసాగారు, ఎట్టకేలకు ఆ సినిమా రూపుదిద్దుకుని నేడు ప్రేక్షకులు ముందుకు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే తాము ఆశించిన రేంజ్ లో సినిమా లేదని, ఈ సినిమాలో రజిని క్యారెక్టర్ పేరు ఆదిత్య అరుణాచలం అయినప్పటికీ, సినిమాలో మాత్రం గతంలో రజిని నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం మాదిరి స్టఫ్ లేదని అంటున్నారు. 

 

దర్శకుడు మురుగదాస్ ఎంచుకున్న కథ బాగున్నా, దానిని స్క్రీన్ పై ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో మాత్రం కొంతవరకు విఫలం అయినట్లు చెప్తున్నారు. రజిని మార్క్ యాక్షన్స్, ఫైట్స్, ఎమోషన్స్, సాంగ్స్, స్టయిల్ వంటివి కోరుకునే వారికి ఈ సినిమా ఎంతో నచ్చుతుందని, అయితే సాధారణ ప్రేమశకులు మాత్రం ఈ సినిమాను ఒక్కసారి మించి చూడలేకపోవచ్చని అంటున్నారు. మరి మున్ముందు ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ తో ముందుకు సాగుతుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: