కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల 2.0, అలానే పేట సినిమాల్లో హీరోగా నటించారు. గత ఫ్లాప్ సినిమాలతో పోలిస్తే ఆ రెండు సినిమాలు కూడా ఆయనకు మంచి విజయాన్నే అందించాయి అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజిని నటించిన తాజా సినిమా దర్బార్. స్టార్ హీరోయిన్ నయనతార రజిని సరసన జతకట్టిన ఈ సినిమాలో నివేత థామస్ ఒక కీలక పాత్రలో నటించగా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ గా నటించడం జరిగింది. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ సినిమాకు సంతోష్ శివన్ ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. 

 

అయితే నేడు ఈ సినిమా తొలి షో నుండి వెలువడుతున్న టాక్ ని బట్టి చూస్తే, ఈ సినిమా మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్, మాస్ హంగులతో తెరకెక్కినట్లు సమాచారం. ప్రస్తుత సమాజంలో నలుగుతున్న ఒక సమస్యను ఈ సినిమా కథా వస్తువుగా ఎంచుకున్న దర్శకుడు మురుగదాస్, ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా తీయడంలో కొంత తడబడ్డాడని అంటున్నారు. సినిమాలో రెండు సాంగ్స్, యాక్షన్ సీన్స్, రజిని స్టైల్ సీన్స్, ఫైట్స్ వంటివి బాగానే ఉన్నాయని, అయితే విజువల్ గా మాత్రం ఫోటోగ్రఫిలో కొన్ని సీన్స్ ఎబ్బెట్టుగా అనిపిస్తాయని, అలానే కొన్ని సీన్స్ లో ఫోటోగ్రఫి చాలా పూర్ గా ఉన్నట్లు అర్ధం అవుఛ్తుందని అంటున్నారు. 

 

మంచి పేరున్న సంతోష్ శివన్ ఈ సినిమాకు ఎటువంటి టెక్నాలజీని వాడి సినిమాను చిత్రీకరించారో అర్ధం కావడం లేదని కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ యాక్షన్ సీన్స్ అయితే అడిగిపోయాయని, హీరోయిన్ నయనతారతో పాటు కీలక పాత్రలో నటించిన నివేత థామస్ ఎంతో బాగా నటించిందని అంటున్నారు. కొన్నాళ్ల నుండి రజిని ఫ్యాన్స్, ఆయన నుండి ఎటువంటి సినిమా అయితే ఆశిస్తున్నారో, దర్బార్ చాలావరకు అలానే ఉంటుందని, మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ఒక ఫక్తు యావరేజ్ సినిమాగానిలుస్తుందని  ప్రేక్షకులు చెప్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: