కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా దర్బార్ నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. రజినీకాంత్సినిమా ద్వారా చాలా ఏళ్ళ విరామం తరువాత ఆదిత్య అరుణాచలం అనే మాస్ కమర్షియల్ పోలిస్ పాత్రలో నటించి మెప్పించారు. ఎప్పుడూ కూడా తన సినిమాల్లో మంచి మెసేజిని పొందుపరిచే మురుగదాస్, ఈ సినిమాలో కూడా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఒక ముఖ్య సమస్యను తీసుకుని సినిమాని, పలు కమర్షియల్ హంగులు జోడించి తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇక నిన్న అర్ధరాత్రి నుండి యుఎస్ఏ,

 

యూఏఈ వంటి దేశాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక ఆ షోల నుండి ఈ సినిమాకు బాగానే టాక్ రావడం జరిగింది. ఇక నేడు ఉదయం తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో పడిన షోలను బట్టి వెలువడుతున్న టాక్ ని చూస్తుంటే దర్బార్ సినిమా ఫక్తు యావరేజ్ సినిమా మాదిరిగానే నిలబడే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నట్లు సమాచారం. దర్శకుడు మురుగదాస్ మంచి పాయింట్ ని సినిమా కథగా ఎంచుకున్నప్పటికీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదని, అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడని అంటున్నారు. అయితే రజినీకాంత్ స్టైల్, యాక్షన్, ఫైట్స్, సాంగ్స్ వంటివి కోరుకునేవారికి ఈ సినిమా బాగానే నచ్చుతుందట. 

 

ఇక మరొక రెండు రోజుల్లో మహేష్ సరిలేరు నీకేవ్వరు, అల్లు అర్జున్ అలవైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అవుతుండగా, ఒకరకంగా రజినీకాంత్ వారిద్దరి సినిమాలకు మంచి కలెక్షన్స్ లభించేలా ద్వారాలు తెరిచారని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మొత్తంగా చూస్తే ఈ దర్బార్ సినిమా రజిని ఫ్యాన్స్ తో పాటు యాక్షన్ సినిమాలు కోరుకునేవారికీ బాగా నచ్చుతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా యావరేజ్ టాక్ సంపాదించడంతో, అది మహేష్, బన్నీలకు ఎంతమేర లాభం చేకూరుస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: