శర్వానంద్‌, సమంత జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘జాను’. తమిళ్ సినిమా 96 రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రెండు రోజుల క్రితం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ ఫస్ట్ లుక్ లో సమంత లేకపోవడంతో అభిమానులు బాగా హర్ట్ అయ్యారు.. 

 

అయితే ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక టీజర్ విడుదల అయ్యింది. నిన్ననే ఈ సినిమా టీజర్ ఈరోజు 5 గంటలకు విడుదల అవుతుంది అని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీజర్ తాజాగా విడుదల అయ్యింది. అయితే టీజర్ ఎలా ఉంది అంటే.. 

 

కే రామచంద్ర అనే డైలాగ్ తో ప్రారంభమయ్యే ఈ టీజర్ హేయ్ జానూ అంటూ ఓ మంచి మ్యూజిక్ తో వారి టీనేజ్ లవ్ స్టోరీని సాఫ్ట్ గా చూపిస్తూ సమంత.. శర్వానంద్ తో చాలా దూరం వెళ్లిపోయావా రామ్ అని అడిగితే.. నిన్ను ఎక్కడ వొదిలేసానో అక్కడే ఉన్నాను.. అంటూ టీనేజ్ నుండి ఇప్పటి వరుకు.. వాళ్ళు విడిపోయి ఎంత బాధగా పడుతున్నారు అనే ఫీలింగ్స్ అన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. చాలా ఫీల్ తో టీజర్ మన ముందుకు తీసుకొచ్చారు. 

 

ఎప్పటిలనే శర్వానంద్ తన నటనతో అదరగొట్టేశాడు.. మళ్ళి మళ్ళి ఇది రాని రోజులో శర్వా కనిపిస్తాడు. అలానే సమంత కూడా అద్భుతంగా నటించింది.. కానీ తమిళంలో త్రిష జీవిస్తే.. ఇక్కడ సమంత ఓవర్ గా యాక్టింగ్ చేసింది అని అనిపిస్తుంది. ఆలా.. ప్రక్షకులైన మనకు మంచి లవ్ ఫీల్ వచ్చేలా ఈ సినిమాను చిత్రీకరించినట్టు కనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎంత ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. 

 

సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చిత్ర ఫస్ట్‌ లుక్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా '96' సినిమాకు జాను రీమేక్. ఒక విధంగా చెప్పాలంటే.. ఇప్పుడు రిలీజ్ అయినా ఈ ట్రైలర్ మళ్ళి మళ్ళి చూడాలనిపిస్తుంది. మీరు ఒకసారి చూసేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: