సినీ పరిశ్రమలో నటించే హీరో, హీరోయిన్లు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో మునిగిపోతుంటారు.. అలా కొంత కాలం ప్రేమించుకున్న తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. ఇలా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో ఒకర్ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగాన్, కాజోల్.  ఈ జంట వివాహం జరిగిన తర్వాత మొదటి సారిగా దాదాపు పదేళ్ల తర్వాత ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’ సినిమాతో కనిపిస్తున్నారు. మరాఠా అధినేత ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో సుబేదార్‌గా పనిచేసిన మరాఠా యోధుడు తానాజీ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. శుక్రవారం విడుదల కానుంది.  

 

ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ బిజీలో చిత్ర యూనిట్ ఉన్నారు.  ఈ సందర్భంగా కాజోల్ తన జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో చెప్పింది.  అజయ్ తో నాలుగేళ్లపాటు ప్రేమలో ఉన్నానని.. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్న తరువాతే పెద్దల అనుమతితో ... పెళ్లి రోజునాడు.. అగ్నిహోత్రం చుట్టూ తిరిగేటప్పుడు తన భర్త అజయ్.. పూజారిని వేగంగా తంతు పూర్తి  చేయాలంటూ లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన విషయాన్ని కాజోల్ బయటపెట్టింది.  అలాగే తన జీవితంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా తెలిపింది. 2001వ సంవత్సరంలో 'కభీ ఖుషీ కభీ ఘం' సినిమా షూటింగ్ సమయంలో తాను ప్రెగ్నెంట్ అని తెలిసిందని..   ఆ సినిమా చాలా బాగా వచ్చింది అలాంటి సంతోషకరమైన సమయంలో అబార్షన్ అవ్వడంతో ఆసుపత్రిలో చేరానని తెలిపింది.

 

ఆ ఒక్కసారే కాదు.. నాకు అలా ఇంక్కోసారి కూడా అబార్షన్ అయ్యిందని.. అలా రెండు సార్లు అబార్షన్ కావడంతో నా భర్త.. కుటుంబ సభ్యులం కన్నీరు మున్నీరు అయ్యామని తెలిపింది. ఆ తర్వాత  మాకు నైసా, యుగ్ ఇద్దరు పిల్లలు పుట్టారని కాజోల్ చెప్పారు. ఇప్పుడు నాది నిండు కుటుంబం.. ఎంతో సంతోషంలో ఉన్నామన్నారు. కాగా,  ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’  మూవీలో అజయ్ దేవగన్ తానాజీ మలుసారే పాత్ర పోషిస్తుండగా కాజోల్ తానాజీ భార్య సావిత్రిబాయి మలుసారే పాత్రలో నటించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: