2019.. యువ సామ్రాట్ నాగ చైతన్య కు బానే కలిసొచ్చింది. వరస పరాజయాలతో సతమతవుతున్న సమయంలో గత ఏడాది ఏకంగా రెండు సినిమాలతో వచ్చి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టాడు. అందులో సోలో హీరోగా నటించిన మజిలి బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మల్టీ స్టారర్ వెంకి మామ డీసెంట్ హిట్ అనిపించుకుంది. ఇక చైతన్య ప్రస్తుతం సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తన 19వచిత్రంలో నటిస్తున్నాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లవ్ స్టోరీ అనే టైటిల్ ప్రచారం లో ఉంది. ఈ చిత్రంలో ఫిదా ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే సూపర్ హైప్ ఏర్పడింది.
గత కొన్ని రోజుల నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో యూ ట్యూబ్ పాపులర్ కామెడీ షో.. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా ఈ షెడ్యూల్ లో గంగవ్వ జాయిన్ అయ్యింది. ఆమె తోపాటు ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల,సీనియర్ హీరోయిన్ దేవయాని కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఇక ఈసినిమా టైటిల్ ను అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను సంక్రాంతి కి విడుదల చేయనున్నారు. ఏషియన్ సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై నారాయణ దాస్ నారంగ్ ,
రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తుండగా స్టార్ మ్యూజిక్
డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 2న ఈచిత్రాన్ని ప్రేక్షకుముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారు.