సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరూ కోసం ప్రీమియంలు పడిపోతాయి. ఈపాటికి ఏదో ఒక టాక్ బయటకు అయితే వచ్చేస్తుంది, మరి 24 గంటల వ్యవధి ఉన్నటువంటి టైంలో ఈ సినిమాకు సంబంధించి బయటికి వస్తున్న అప్డేట్లు ఆసక్తికరంగా మారాయి అని చెప్పుకోవాలి. మహేష్ బాబు ప్రీమియర్ ఫస్ట్ టాక్ అంటూ సినిమా యూనిట్ చెప్పిన సమాచారంతో ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సరిలేరు నీకెవ్వరు సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ గా ఉందని ఈ సినిమాతో మహేశ్ బాబు మరొక్కసారి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ కొట్టడం ఖాయమని అంటున్నారు అభిమానులు. అయితే సినిమా లో కామెడీ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ రొటీన్ యాక్షన్ డ్రామా కావడం మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాకి మైనస్ ఎలా ఉంటుందని అంటున్నారు చాలామంది.
మొదటి నుంచి ట్రైన్ కామెడీ మీద డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ ఎక్కువగా ఉండదని 20 నుంచి 30 నిమిషాల లోపు మాత్రమే ఉంటుందని, ఈ ట్రైన్ జర్నీ లో తన ఫ్యామిలీతో కలిసి మహేష్ బాబుని తనవైపు తిప్పుకునే ఇష్టపడేలా చేసుకోవడం ఓవరాల్ గా ఉంటుందని అంటున్నారు. అయితే ఇదే ఎపిసోడ్ లో ఒక ఫైట్ సీన్ కూడా అనిల్ రావిపూడి ప్లాన్ చేశాడని చెబుతున్నారు. కామెడీ తో పాటుగా తమన్నా ఐటెం సాంగ్ చాలా పాజిటివ్ గా ఈ సినిమాకి కిక్ ఇస్తుందట.
సెకండ్ హాఫ్ లో విజయశాంతి కారెక్టర్ బాగుంటుంది అనే టాక్ నడుస్తోంది, ప్రకాష్ రాజ్ విలన్ గాకనిపించారు ట్రెయిలర్ లో అయితే .. ఈసారి కొత్తగా ఒక ప్రయత్నం చేశారు చిత్రా బృందం అని చెబుతున్నారు. ప్రకాష్ రాజ్ తో కూడా కామెడీ పండించే ప్రయత్నాలు జరిగాయట .. కేవలం హీరో కి విలనిజం చూపించడం , రౌడీలతో ఫైట్ లూ ఇవే కాకుండా ప్రకాష్ కారెక్టర్ తెరమీద చాలా డిఫరెంట్ గా ఉంది అనీ ఆ యాంగిల్ ట్రెయిలర్ లో కూడా చూపించలేదు అనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు అవుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.. రేపు సాయంత్రానికల్లా సరిలేరు నీకెవ్వరు సినిమాకి టాక్ బయటికి వచ్చే అవకాశం ఉంది, దాంతో తెలుగు సినిమా ప్రేక్షకులు ఎలాగ తీసుకుంటారు అనేది తెలిసిపోతుంది. సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అవ్వాలి అని కోరుకునే ప్రతి మహేష్ బాబు అభిమాని ఈ ఆర్టికల్ షేర్ చేయండి