అక్కినేని నాగచైతన్య సరసన ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత రూత్ ప్రభు, తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తరువాత మెల్లగా తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని ముందుకు సాగిన సమంత, వాటిని హిట్స్ గా మలుచుకోవడంలో ఎంతో సఫలం అయిందనే చెప్పాలి. నిజానికి టాలీవుడ్ లో సమంతను గోల్డెన్ లెగ్ అని ఎందుకంటారంటే, ఆమె నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు పెద్ద హిట్స్ కావడమే. ఇకపోతే ఇటీవల తన మొదటి సినిమా హీరో అయిన అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సమంత, ఆ తరువాత నుండి ఒకింత ఆచి తూచి మాత్రమే సినిమాలు చేస్తోంది. ఇక గత ఏడాది యూ టర్న్, మజిలీ

 

ఓ బేబీ సినిమాల్లో నటించిన సమంత, ఆ మూడు కూడా విజయాలు సాధించడంతో, మరింత జోష్ తో సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇక ప్రస్తుతం యువ హీరో శర్వానంద్ తో కలిసి జాను అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత, తప్పకుండా ఆ సినిమాతో కూడా మరొక హిట్ కొట్టేలా కనిపిస్తోంది. ఇటీవల తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా రూపొంది సూపర్ డూపర్ హిట్ కొట్టిన 96 అనే మూవీకి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ జాను సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని నిన్న రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ప్రస్తుతం టీజర్ ప్రతి ఒక్క యువతీ యువకుల మనసుని తాకుతోంది అనే చెప్పాలి. చిన్నప్పుడే ప్రేమించుకుని, ఆ తరువాత పరిస్థితుల ప్రభావం వలన విడిపోయిన ఇద్దరు ప్రేమికులు, పెరిగి పెద్దయిన కొన్నేళ్ల తరువాత  కలిసినపుడు వారి మనసులు ఏ విధంగా స్పందిస్తాయి అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

 

ఇక ఈ టీజర్ లో శర్వా, సమంత ఒకరికి ఒకరు పోటీపడి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక టీజర్ లోని ఒక సన్నివేశంలో భాగంగా హీరోపై తన మనసులోని ప్రేమను గుర్తుచేసుని బాధతో అమాంతం అతడి మొహం తడుముతూ సమంత భోరున ఏడ్చేసే సన్నివేశం అందరి మనసులను కదిలిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ టీజర్ యూటుబ్ లో మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: