టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి కొన్నేళ్ల తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తోంది. కాగా ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో నటిస్తుండగా రాజేంద్ర ప్రసాద్, సంగీత, రావు రమేష్, జయప్రకాశ్ రెడ్డి, రఘు బాబు, ప్రకాష్ రాజ్, హరితేజ, సుబ్బరాజు, వెన్నెలకిషోర్, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

 

ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ సూపర్ సక్సెస్ అవడంతో పాటు సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశాయనే చెప్పాలి. ఇక రేపు ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా నిన్న ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా మీడియా వారికి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. అయితే ఆ ఇంటర్వ్యూ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ, సినిమా చాలాబాగా వచ్చిందని, తప్పకుండా మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం మా యూనిట్ అందరికి ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఇక కొన్నేళ్ల తరువాత మా సినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి గారి రోల్ ఎంతో అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. 

 

ఇక ఒక సందర్భంలో మహేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం మొబైల్స్ ఫోన్స్ లో కెమెరా ఉండడం ఎటువంటి సమస్యలకు తావిస్తోంది అంటే, సెలెబ్రిటీలు కనీసం ప్రశాంతంగా ఇడ్లి కూడా తినలేని పరిస్థితి నెలకొందని, మనం ఇటువైపు తిరిగి ఇడ్లి ముక్క నోట్లో పెట్టుకుంటూ ఉండగానే, అటువైపు నుండి దానిని ఫోటో తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసేస్తున్నారని సరదాగా అన్నారు. ఒకప్పుడే నయం అని, అప్పట్లో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఫోన్ లు ఉండేవని, అయితే తాను ప్రస్తుతం ఫోన్లను, యువతను తప్పుపట్టడం లేదుకానీ, కొంతవరకు ప్రైవసీని దెబ్బతీసేవిగా ఇప్పటి ఫోన్స్ లో కెమెరాలు తయారయ్యాయని వ్యాఖ్యానించారు......!! 

మరింత సమాచారం తెలుసుకోండి: