సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొన్ని గంటల్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని మహేష్ చాలా ధీమాగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ప్లాన్స్ ఏంటి అని అందరు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే మహెష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో సినిమా దాదాపు ఫిక్స్ అని అనుకున్నారందరు. కానీ ఎప్పుడైతే సందీప్ రెడ్డి మరో హిందీ సినిమా ప్రకటించాడో అప్పుడే అందరికీ ఈ కాంబినేషన్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలు నిజమేనని కన్ ఫర్మ్ చేశాడు మహేష్. తన నెక్ట్స్ సినిమాను వంశీ పైడిపల్లితో చేయబోతున్నట్టు అనౌన్స్ చేశాడు.

 

గత పదేళ్లుగా నాన్-స్టాప్ గా సినిమాలు చేస్తున్నాను. కానీ బయటకు మాత్రం నేను ప్రతి 3 నెలలకు హాలిడేస్ కు వెళ్లిపోతున్నానని అనుకుంటున్నారు. కానీ అలా వెళ్లను. పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడే వాళ్లను తీసుకెళ్తాను. నా బ్రెయిన్ మాత్రం ఎప్పుడూ వర్క్ మీదే ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత 3 నెలలు బ్రేక్ తీసుకుంటాను. వంశీ పైడిపల్లి సినిమా ఆల్రెడీ ఓకే చేశాను. తను పక్కా స్క్రిప్ట్ తో రెడీ అయ్యేలోపు నేను ఒక 3 నెలలు బ్రేక్ తీసుకుంటాను...అన్నాడు సూపర్ స్టార్. ఇలా మహర్షి తర్వాత మరోసారి వంశీ పైడిపల్లితో వర్క్ చేయబోతున్న విషయాన్ని బయటపెట్టాడు మహేష్. దీన్ని బట్టి సందీప్ రెడ్డితో సినిమా ఉండదనే విషయాన్ని తేల్చి చెప్పాడు. అంతేకాదు.. సందీప్ రెడ్డి లాంటి డైరక్టర్లతో ఎందుకు పనిచేయలేమో కూడా  ఇన్‌డైరెక్ట్ గా వెల్లడించాడు మహేష్.

 

ప్రయోగాలు అనుకోవడానికి బాగుంటాయి కానీ, భారీ బడ్జెట్ తో సినిమా చేస్తున్నప్పుడు అన్ని యాంగిల్స్ కవర్ అవ్వాలి. అదే సమయంలో కొత్తదనం ఉండాలి. పెద్ద హీరోలందరం ఇప్పుడొక విచిత్రమైన జోన్ లో ఉన్నాం. మా సినిమాల్లో అన్నీ ఉండాలి. లేదంటే జనాలు రిజెక్ట్ చేస్తారు. మనం కావాలని డిఫరెంట్ గా ఓ చిన్న సినిమా చేసేయలేం కదా అన్నాడు. ఇలా సందీప్ రెడ్డితో సినిమా ప్రస్తుతానికి లేదనే విషయాన్ని నిర్మొహమాటంగా బయటపెట్టాడు మహేష్. ఇకపై కూడా తన సినిమాలకు తాను సహ-నిర్మాతగా వ్యవహరిస్తానని స్పష్టంచేసిన మహేష్.. సరిలేరు నీకెవ్వరు సినిమా చేయాలనే నిర్ణయాన్ని తన కెరీర్ లోనే గొప్ప నిర్ణయంగా క్లారిటి ఇచ్చాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: