రజినీకాంత్ ,
చిరంజీవి లాంటి మహామహులే
మీడియా సమావేశం లో పాల్గొన్నప్పుడు ఆచితూచి మాట్లాడుతారు. కానీ
సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఎప్పడు మీడియా మీట్ లో పాల్గొన్న విలేకర్లు అడిగిన ప్రశ్నలకు కాస్త వెటకారంగానే స్పందిస్తారు. అయితే విలేకర్లు కుడా మహేష్ కు చిర్రెత్తుకు వచ్చే ప్రశ్నలు వేస్తే అలా స్పందించడంలో తప్పులేదు కానీ మాములు ప్రశ్నలకు కూడా అంతే సెటైరికల్ గా సమాధానం చెప్తే నే అతిగా అనిపిస్తుంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్ లో భాగంగా ఇదే సీన్ రిపీట్ అయ్యింది.
నిన్న
అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రింట్ , వెబ్
మీడియా ఇంటర్వ్యూ లో పాల్గొన్న మహేష్ ,రిపోర్టులకు పంచులు వేశాడు. రష్మిక తో పనిచేయడం ఎలా వుంది అని ఓ విలేకరి అడగగా... ఎలా ఉంటుంది బానే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు. పోనీ ఇది రెగ్యులర్ గా అడిగే ప్రశ్న కాబట్టి అలా సమాధానం ఇచ్చాడనుకోవచ్చు . దీని తరువాత నిర్మాణం లో భాగస్వామి అవుతున్నారు కదా ఇక ముందు కూడా కొనసాగిస్తారా అని అడగగా .. ఏం అవ్వకూడదా అని పంచ్ వేశాడు. ఇలాగే దాదాపు ప్రతి ప్రశ్నకు వ్యంగ్యంగా జవాబు ఇచ్చి
మీడియా వారికి అసహనం తెప్పించాడు.
ఇక సరిలేరు నీకెవ్వరు రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి.
కామెడీ మరియు యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించగా
మహేష్ కు జోడిగా కన్నడ
బ్యూటీ రష్మిక మందన్న నటించింది . దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైమెంట్స్ ,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.