ప్రముఖ దర్శకులు వాసు తెరకెక్కించిన ‘చంద్రముఖి’ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నటించిన నయనతార ఆ నత్తిగా మాట్లాడుతూ... అమాయకంగా అందరినీ ఆకర్షించింది.  ఆ తర్వా గజినీ మూవీలో తన హాట్ అందాలతో కుర్రాళ్లను గిలిగింతలు పెట్టింది.  తెలుగు, తమిళంలో వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాధిన ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ నయన్ ఒక్కరే అంటారు.  చిన్న హీరోల రెమ్యూనరేషన్ స్థాయిలో ఆమె తన రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్లారు.  మొదటి నుంచి నయనతార నటనలో తిరుగులేదు. కానీ ఆమె యాటిట్యూడ్ విషయంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. 

 

ఎంత పెద్ద హీరోతో సినిమా తీసినా ఆమె రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఖచ్చితంగా వ్యవహరిస్తుంటారు.. కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం జీరో.  ఇటీవల తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ ప్రమోషన్ లో ఎక్కడా పాల్గొనలేదు.  ఆమె స్థానంలో తమన్నా ప్రమోషన్ లో పాల్గొన్నారు.  ఇక నిన్న రిలీజ్ అయిన దర్భార్ మూవీ ఈవెంట్ లో కూడా నయన్ ఎక్కడా కనిపించలేదు.. దాంతో పెద్ద హీరోల సినిమాలకే ప్రమోషన్ విషయంలో ఇంత నిర్లక్ష్యం అయితే.. మామూలు హీరోల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.  తాను ఎలాంటి ఫంక్షన్లకు హాజరు కానని మొదలు చెప్పేస్తుందట నయన్. ఇన్ని కండిషన్స్ పెట్టినా ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ పారితోషికం ఇచ్చి మరీ దర్శమ నిర్మాతలు తమ చిత్రాల్లో నయన్ ని ఎంపిక చేసుకుంటుంటారు.

 

తాజాగా తమలో అణుచుకున్న కోపాన్ని తమిళ దర్శక నిర్మాతలు ఇప్పుడిప్పుడే బయటకు తీస్తున్నారు.  నయనతార ఇటీవల ఓ టివి ఛానల్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. అక్కడ ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది..ఇది చూసి దర్శక, నిర్మాతలు  విమర్శల గళం పెరుగుతోంది. ఈ సంఘటనతో నయన్ నిజస్వరూపం బయటపడిందని దర్సక నిర్మాతలు అంటున్నారు. నయనతారకు అవార్డు అందుకునేందుకు, వ్యక్తిగత ప్రచారం చేసుకునేందుకు సమయం ఉంటుంది కానీ.. ఆమె నటించిన సినిమాలకు ప్రచారం కల్పించేందుకు మాత్రం తీరిక ఉండదా అని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు.  అంతే కాదు ఈ విషయం కాస్త  నడిగర్ సంఘం వరకు వెళ్లిందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: