ఈ మధ్య  సినిమా ఇండస్ట్రీలో పైరసీ లీకుల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది విషయం తెలిసిందే. సినిమా విడుదలైన ఒక్కరోజులోనే పైరసీ చేసి ఆన్ లైన్లో లీక్ చేసేస్తున్నారు పైరసీగాళ్ళు . ఇక కోట్లు కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి సినిమాను తీసిన దర్శక నిర్మాతలందరూ లబోదిబో మంటున్నారు. ఒక్కరోజులోనే పైరసీ ద్వారా సినిమా ఆన్లైన్లో వస్తుండడంతో చాలామంది ప్రేక్షకులు సినిమా థియేటర్ కి వెళ్లి ఏం చేస్తాంలే... ఇక్కడ ఇంట్లో ఫోన్ లో పెట్టుకుని చూడొచ్చు కదా అని అనుకొని ఇంటి పట్టునే ఉండి పోతున్నారు. దీంతో వందల కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా సరైన కలెక్షన్లు రాక నష్టాల్లో మునిగిపోతుందని  నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పైరసీ బెడద  అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా పైరసీ బెడద రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. 

 

 

 

 భాషతో సంబంధం లేకుండా ఇండస్ట్రీతో అవసరం లేకుండా అన్ని భాషల సినిమాలను అని ఇండస్ట్రీల సినిమాలను పైరసీ చేస్తూ ఆన్ లైన్లో లీక్ చేసేస్తున్నారు. ఒకరోజు తేడాతోనే ఆన్లైన్లో సినిమా వచ్చేస్తుంది ఏ కొత్త సినిమా అయినా. ఇప్పుడు తాజాగా దర్బార్ సినిమాకు కూడా పైరసీ బెడద తప్పలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్  దర్బార్ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటు దూసుపోతుంది. ఇకపోతే దర్బార్ సినిమాకు తమిళ రాకర్స్ షాకిచ్చారు. సినిమా విడుదల కాగానే పైరసీ చేసి ఆన్ లైన్లో లీక్ చేసే తమిళ రాకర్స్ దర్బార్  సినిమా విడుదలై తొలి ఆట పూర్తికాగానే పైరసీ చేసారు. ఆ తర్వాత ఆన్లైన్లో లీక్ చేశారు. సాధారణంగా తమిళ రాకర్స్ ఏ భాషలో విడుదలైన సినిమా అయిన  ఒకరోజు వ్యవధిలోనే పైరసీ చేసి ఆన్ లైన్లో లీక్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ సినిమాను కూడా వదల్లేదు తమిళ రాకర్స్. 

 

 

 కొత్త సినిమాలు పైరసీ చేయడంలో సిద్ధహస్తులైన  తమిళ రాకర్స్ బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ ఇలా ఏ భాష  సినిమా విడుదలైన వెంటనే పైరసీ చేసేస్తుంటారు. ఇక తాజాగా దర్బార్ సినిమాను కూడా ఒక్క రోజు కూడా పూర్తి కాకముందే పైరసీ చేసి ఆన్ లైన్లో లీక్ చేయడంతో దర్శక నిర్మాతలు అందరూ షాక్ కి గురయ్యారు. కాగా ఈ సినిమాలో రజనీ డ్యూయల్ రోల్ పోషించారు. పోలీస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం గా ఒక పాత్రలో నటిస్తే సామాజిక కార్యకర్తగా మరో పాత్రలో ఒదిగిపోయారు రజనీకాంత్. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన నయనతార నటించగా రజనీకాంత్ కూతురు గా నివేద థామస్ నటించినది.  ఈ సినిమాలో విలన్గా నటించిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అదరగొట్టాడు. కాగా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా భారీ వసూళ్లు రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు చెబుతుంటే ఈ పైరసీ బెడద తో వచ్చే వసూళ్లు  కూడా వస్తాయా  లేవా అనే భయం పట్టుకుంది నిర్మాతల్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: