అల వైకుంఠపురంలో సినిమా జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సినిమాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ కాబోతున్నది.  మహేష్ బాబు, అల్లు అర్జున్ లు మొదటిసారి సంక్రాంతికి తలపడబోతున్నారు.  ఈ రెండు సినిమాలు ఎలా ఉంటాయా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  సినిమాపై ప్రతి ఒక్కరికి నమ్మకం ఉన్నది.  ఎందుకంటే ఇది త్రివిక్రమ్ సినిమా.  


త్రివిక్రమ్ సినిమాలు ఎంత బాగాలేదు అనుకున్నా మంచి వసూళ్లు వస్తాయి.  అజ్ఞాతవాసి సినిమా కూడా బాగాలేకపోయినా తగినన్ని వసూళ్లు సాధించింది.  అయితే, బన్నీతో చేస్తున్న మూడో సినిమా కావడంతో టెన్షన్ పడుతున్నారు.  ఎందుకంటే పవన్ తో తీసిన మూడో సినిమా ఫెయిల్ అయ్యింది.  ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా కాబట్టి టెన్షన్ పడుతున్నారు.  


అయితే సెన్సార్ టాక్ ప్రకారం సినిమా బాగా వచ్చిందని అంటున్నారు.  మంచి విజయం సాధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా తెరకెక్కుతోంది.  త్రివిక్రమ్ టైటిల్ లాగానే సినిమా కూడా ఎలాంటి హడావుడి లేకుండా కూల్ గా ఉంటుందని అంటున్నారు.  జనవరి 12 వ తేదీన తెరక్కుతున్న మూవీపై ఉన్న అంచనాలు ఎలా రీచ్ అవుతుందో చూడాలి.  


ఇప్పటికే దర్బార్ మంచి విజయం సొంతం చేసుకుంది. సరిలేరు నీకెవ్వరూ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  పండగకు వచ్చే ఎంటర్టైన్మెంట్ సినిమాలు పక్కా హిట్ అవుతుంటాయి.  గతేడాది ఎఫ్ 2 ఎంటర్టైనర్ గా వచ్చి విజయం సాధించింది.  ఇప్పుడు రాబోతున్న సరిలేరు కూడా పక్కా ఎంటర్టైనర్ సినిమానే.  మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాలు హిట్ కావాలని కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: