‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రిజల్ట్ రేపు ఉదయానికి మాత్రమే తెలిసే ఆస్కారం ఉంది. అయితే ఈ మూవీ రిజల్ట్ రాకుండానే మహేష్ నిన్న భాగ్యనగరంలోని తాజ్ బంజారా హోటల్ లో నిన్నరాత్రి ఈ మూవీ యూనిట్ సభ్యులకు మాత్రమే కాకుండా తనతో సన్నిహితంగా ఉండే కొదరు దర్శకులకు అదేవిధంగా తనతో ఆత్మీయంగా ఉండే కొందరు మీడియా ప్రతినిధులకు భారీ పార్టీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం బన్నీ మహేష్ ల మధ్య జరుగుతున్న వార్ లో ఖచ్చితంగా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ పై నెగిటివ్ ప్రచారం జరిగే ఆస్కారం ఉంది. ఈ విషయాలను ముందుగానే గ్రహించి మహేష్ తనకు సన్నిహితంగా ఉండే మీడియా వ్యక్తులను కూడ నిన్నటి డిన్నర్ కు పిలిచి ఉంటాడు అన్న సందేహాలు కలుగుతున్నాయి.

ముఖ్యంగా మహేష్ సినిమాలకు మొదటిరోజు విపరీతమైన ఓపెనింగ్స్ వచ్చినా టాక్ లో ఏమాత్రం తేడా వచ్చినా రెండవరోజు మార్నింగ్ షోకు ధియేటర్లు బోసిపోయిన సంఘటనలు గతంలో చాలాసార్లు జరిగాయి. దీనికితోడు ఓవర్సీస్ ప్రేక్షకులు రివ్యూలను చూసి సినిమాలకు వచ్చే అలవాటు చేసుకున్నారు. 

ఇలాంటి పరిస్థితులలో ‘సరిలేరు నీకెవ్వరు’ లాంటి భారీ సినిమా పోటీని తట్టుకుని నిలబడాలి అంటే మహేష్ ను సపోర్ట్ చేసే మీడియా వర్గాల అండదండలు కూడ కావాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇంకా ఈ మూవీ ఫైనల్ రిజల్ట్ తెలియకపోయినా తన టెన్షన్ ను బయటపడనీయకుండా ముందుగానే సంబరాలు చేసుకుంటూ తాను ఈ మూవీ విజయం పై ఎంత నమ్మకంగా ఉన్నాడో తెలియచెప్పే సంకేతాలు ఇవ్వడానికి ముందుగానే ఈ డిన్నర్ పార్టీని ఇచ్చినట్లు ఇండస్ట్రీలోని కొందరి కామెంట్స్. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ టాక్ ఎలా ఉన్నా మహేష్ కెరియర్ లో ఇప్పటి వరకు రాని హైయస్ట్ ఓపెనింగ్ కలక్షన్స్ ‘సరిలేరు’ కు రాబోతున్నాయి అంటూ అంచనాలు అందుతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: