సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగ భారీ అంచనాలతో విడుదలకి సిద్ధం అవుతోంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు, పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించారు.

 

 

 

ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లలో బిజీగా ఉన్న మహేష్ అండ్ టీమ్ మీడియా కి ఇంటర్వ్యూలని ఇస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని ప్రశ్నలకి ఆసక్తికరమైన సమాధానాలిచ్చాడు.  మహేష్ బాబు ఇది వరకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు లాంటి మల్టీ స్టారర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ మరియు వెంకటేష్ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులకి బాగా నచ్చింది.

 

 

సినిమా వచ్చి కూడా చాలా రోజులైనా కూడా మహేష్ మళ్లీ మల్టీస్టారర్ చేయలేదు. అయితే మల్టీ స్టారర్ సినిమాపై మీ అభిప్రాయమేమిటై అడగ్గా మహేష్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.  మల్టీ స్టారర్ చేయడానికి తనకేమి అభ్యంతరం లేదన్న మహేష్ తన ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి కథతో వస్తే మల్టీ స్టారర్ చేయడానికి సిద్ధం అని చెప్పారు. దర్శకులు మంచి కథతో వస్తే ఏ హీరోతో అయినా మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు సిద్ధం అని చెప్పాడు.

 

 

 

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసరుగా కనిపించనున్నారు. అర్మీ ఆఫీసరుగా నటించడం ఇదే మొట్టమొదటి సారి. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఇంకా ప్రకాష్ రాజ్ ప్రతినాయక పాత్రలో మెరవనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గ నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: