సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు కేవలం తమిళనాడులో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక సంక్రాంతి పండగను అందరికంటే ముందు మొదలుపెడతున్నాడు రజినీకాంత్. ఈయన నటించిన దర్బార్ సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల అయింది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో నయనతార, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించారు. రజినీకాంత్ సినిమా ఎలా ఉన్నా కూడా అది రజినీ సినిమా అంటే.. అభిమానులు తొలిరోజు పండగ చేసుకుంటారు.

 

ప్ర‌స్తుతం ద‌ర్బార్ సినిమా విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఊహించినట్లుగానే ఈ చిత్రం ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉన్నాయి. రజినీ మేనియా అన్నిచోట్లా కనిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో కూడా రికార్డ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అక్కడ భారీ వసూళ్లపై కన్నేసాడు రజినీ. మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసి మురుగదాస్ తెరకెక్కించిన దర్బార్ కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతుంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. మ‌రో విష‌యం ఏంటంటే.. సోలో తమిళ సినిమా కావడంతో పొంగల్‌కు రచ్చ చేయడం ఖాయంగా మారిపోయింది.

 

ప్ర‌స్తుతం తమిళనాట అయితే రజినీకి తిరుగులేకుండా పోయింది. ఈ క్ర‌మంలోనే తమిళనాడులోనే 20 కోట్ల ఓపెనింగ్ తెచ్చుకుంది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల వరకు షేర్ వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక, కేరళలో కూడా మంచి వసూళ్లే తీసుకొచ్చింది దర్బార్. మొత్తానికి ర‌జినీ ద‌ర్బార్ ఫ‌స్ట్ డే దుమ్ముదులిపేశాడ‌నే చెప్పాలి. ఇక ముందు ముందు క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే సంక్రాంతి సీజ‌న్ కావ‌డంతో వ‌ర‌స‌గా పెద్ద పెద్ద రిలీజ్ కాబోతున్నాయి. మ‌రి వాటి ద‌ర్బార్‌పై ఖ‌చ్చితంగా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: