‘పటాస్’ మూవీతో అనీల్ రావిపూడికి బ్రేక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తరువాత తన సొంత బ్యానర్ లో బాలకృష్ణ హీరోగా చేసి ‘రామారావు’ అనే సినిమాను తీయడానికి చాలా ప్రయత్నాలు చేసాడు. రాజకీయ నేపధ్యంతో ఉండే ఈ కథ బాలకృష్ణకు అన్నివిధాల సరిపోతుందనీ కళ్యాణ్ రామ్ భావించి ఆ మూవీ స్క్రిప్ట్ ను రెడీ పెట్టడమే కాకుండా బాలయ్యను ఒప్పించడానికి అనేక ప్రయత్నాలు చేసాడు. 

అయితే అప్పట్లో అనీల్ రావిపూడి సమర్ధత పై పెద్దగా అవగాహన లేని బాలయ్యమూవీ ప్రాజెక్ట్ చేయడానికి సాహసించలేదు. ఆ తరువాత వరస హిట్లతో దూసుకు పోయిన అనీల్ రావిపూడి ఇప్పుడు ఏకంగా మహేష్ తో సినిమా చేసే స్థాయికి ఎదిగి పోయాడు. 

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనీల్ రావిపూడికి బాలయ్యతో గతంలో తాను చేయవలసిన ‘రామారావు’ మూవీ ప్రస్తావన వచ్చింది. దీనిపై స్పందిస్తూ అనీల్ రావిపూడి అసలు విషయాన్ని బయటపెట్టాడు. వాస్తవానికి తాను బాలకృష్ణను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన ‘రామారావు’ కథ బాగా వచ్చిందనీ అయితే ఆ కథ బాలయ్యకు ఎందుకు నచ్చలేదో తనకు ఇప్పటికీ ఆశ్చర్యమే అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఇప్పటికైనా అవకాశం వస్తే తాను బాలయ్యను కళ్యాణ్ రామ్ ను కలిపి ఒక మల్టీ స్టారర్ తీయాలని తన కోరిక అని చెపుతూ కళ్యాణ్ రామ్ పై తనకు ఉన్న అభిమానాన్ని బయట పెట్టాడు. అదేవిధంగా చిరంజీవితో కూడ తనకు సినిమా తీయాలని తన కోరిక అంటూ ఈ కోరికలన్నీ నెరవేరాలి అంటే ‘సరిలేరు నీకెవ్వరు’ విజయం పై ఆధారపడి ఉంటుంది అన్న విషయం తనకు తెలుసు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు. దీనితో ఈ మూవీ విజయం గురించి అనీల్ రావిపూడి కూడ ఎంత టెన్షన్ పడుతున్నాడో అర్ధం అవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: