‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ టాప్ హీరోల విచిత్ర పరిస్థితి పై కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం టాప్ హీరోలు అంతా ఒక విచిత్రమైన జోన్ లో ఉన్నారని ప్రయోగాలు చేయాలని మనసు నిండా కోరిక ఉన్నా ఏ ప్రయోగం ప్రేక్షకులు నచ్చుతుంది మరి ఏ ప్రయోగం ప్రేక్షకులు నచ్చదు అన్న కన్ఫ్యూజన్ లో నేటి టాప్ హీరోలను వెంటాడుతున్న విషయాన్ని ఓపెన్ గా బయటపెట్టాడు. 

కథలో కొత్తదనం ఉండాలి అన్న విషయం తమ అందరికీ తెలుసు అని చెపుతూ ఆ కొత్తదనంతో కూడిన కథను ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయలేకపోతే వందల కోట్లు కొన్ని రోజులలో ఆవిరి అయిపోతాయి అంటూ కామెంట్ చేసాడు. అందుకే ఇక తాను రానున్న రోజులలో ఏమాత్రం ప్రయోగాలు చేయకూడదని స్థిర నిర్ణయం తీసుకుని పూర్తి కమర్షియల్ హీరోగా కొనసాగాలి అన్న విషయమై తీసుకున్న నిర్ణయాన్ని వివరించాడు. 

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రిలీజ్ టెన్షన్ ను తాను ఎంత తగ్గించుకుందామనుకున్నా తనకు తగ్గడం లేదు అంటూ ప్రస్తుతం తన డిన్నర్ టేబుల్ దగ్గర తానేమి తింటున్నానో తనకే తెలియని టెన్షన్ లో ఉన్న విషయాన్ని ఓపెన్ గా మహేష్ వివరించాడు. ఇక సినిమా ఫ్లాప్ అయితే కొద్దిగా తన గ్యాప్ వచ్చే మాట వాస్తవమే అయినా తన సినిమాను నమ్ముకుని కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన బయ్యర్లు నష్టపోతారా అన్న భయంతో పాటు తనకు టెన్షన్ ఎక్కువ అంటూ మహేష్ కామెంట్ చేసాడు. 

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ తరువాత తాను కనీసం రెండు నెలలు గ్యాప్ తీసుకుంటానని ఆ తరువాత మాత్రమే వంశీ పైడి పల్లితో చేయబోయే సినిమా ఉంటుంది అన్న క్లారిటీ ఇస్తూ ఆ మూవీ పూర్తి కమర్షియల్ సినిమా అని అంటున్నాడు..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: