టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మద్య వరుస విజయాలు అందుకుంటూ వస్తున్నారు.  కొరటాల దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనేనేను’ మూవీస్ తో బంపర్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు గత ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ మూవీతో మరో విజయం అందుకున్నాడు.  ఈ మూడు మూవీస్ లోనూ సోషల్ మేసెజ్ తో పాటు మహేష్ నటనకు మంచి స్కోప్ ఉండేలా కనిపించింది.  తాజాగా కామెడీ సినిమాలతొ తనదైన మార్క్ చాటుకుంటున్న దర్శకుడు అనీల్ రావిపూడి తో ఓ సినిమా తీయాలని భావించారు మహేష్ బాబు.  అనుకున్న క్షణంలోనే అనీల్ రావిపూడి మంచి కథ వినిపించడం.. ఒకే చేయడం అతి తక్కువ కాలంలో సినిమా పూర్తి చేయడం అన్నీ వరుసగా జరిగిపోయాయి. 

 

రేపు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లోకి రాబోతుంది.  ఇప్పటికేీ ఈ మూవీ టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్ కు జోడిగా తొలిసారి రష్మిక మందన నటించింది.   13 ఏళ్ల తర్వాత ఈ మూవీతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఎంట్రీ ఇస్తోంది. తమన్నా ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. అంతే కాదు ఇంట్రవెల్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఓ సన్నివేశంలో కనిపించబోతున్నారట.. ఇన్ని విశేషాలు ఉన్న సరిలేరు నీకెవ్వరు సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ తన తదుపరి మూవీస్ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించాడు. తన తదుపరి మూవీ వంశీ దర్శకత్వంలో ఉంటుందని మహేష్ స్వయంగా ఖరారు చేశాడు. ఇక కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాలో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై మహేష్ స్పందించాడు. ఆ మధ్యన మేమిద్దరం కలుసుకున్న మాట వాస్తవమే. ప్రశాంత్ నీల్ కొన్ని కథలు కూడా వినిపించాడు. దానిపై ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేనని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: