సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా కొన్ని గంటలే సమయం మాత్రమే ఉంది. ఇంకా ఎన్ని గంటలు బాబూ అంటూ మహేష్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే  అన్ లైన్ బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. చివరి నిమిషం వరకూ చిత్రబృందం ప్రచారం చేస్తూ ఫ్యాన్స్ కి దగ్గరవుతూనే ఉన్నారు. ఇప్పటికే ఔట్ పుట్ పై మహేష్ -అనీల్ రావిపూడి బృందం పూర్తి మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాలు సహా.. ఓవర్సీస్ లో ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజవుతోంది.

 

అయితే కేరళలో మహేష్ క్రేజ్ మార్కెట్ వర్గాలకే బిగ్ షాక్ ఇస్తోంది. అక్కడ రిలీజ్ కు ముందే సరిలేరు ఓ కొత్త రికార్డు సొంతం చేసుకుంది. దేవ దూతల రాష్ట్రం గా చెప్పుకునే మలబారు ప్రాంతంలో మహేష్ సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. కేవలం కేరళ లోనే దాదాపు 30 సెంటర్లలలో ఓ తెలుగు సినిమా రిలీజవ్వడం అన్నది చాలా రేర్ గా విషయం. కానీ సరిలేరు సినిమాతో అది ఇప్పుడు సాధ్యమైంది. ఈ సినిమాలో డైలాగ్ మాదిరిగానే.. 'నెవ్వెర్ బిఫోర్ ..ఎవ్వర్ ఆప్టర్'  అన్నట్లే రిలీజవుతోంది. కేరళలో ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా కానీ....ఏ స్టార్ హీరో సినిమా కానీ ఇన్ని సెంటర్లలో రిలీజ్ కాలేదు. ఇదే మొదటి సినిమా కావడం విశేషం.

 

కేరళ మార్కెట్లో మెగాస్టార్ చిరంజీవి- అల్లు అర్జున్- రామ్ చరణ్ లకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక బన్ని క్రేజ్ యూత్ లో ఏ రేంజులో ఉంటుందో చెప్పాల్సిన పనేలేదు. అయితే మెగా కాంపౌండ్ హీరోల్ని మించి ఇప్పుడు మహేష్ కాంపౌండ్ ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహేష్ రిలీజ్ కు ముందే అరుదైన రికార్డు అందుకున్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో కేరళ లో రిలీజ్ అవుతోంది. శనివారం ఉదయం 6.30 గంటలకు మొదటి షో థియేటర్ లో పడనుంది. అయితే  దేవదూతల ఇలా తలంలో మహేష్ హంగామా ఎలా ఉంటుంది? అన్నది కొన్ని గంటల్లో తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సరిలేరు థియేటర్లు ఇప్పటికే ముస్తాబై సిద్దంగా ఉన్నాయి. మహేష్ అభిమానుల్లో ఇంకొన్ని గంటల్లోనే సంక్రాంతి సంబరాలు మొదలు కాబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: