సూపర్ స్టార్ మహేష్ 26వ సినిమాగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ మరో 24 గంటల్లో రిలీజ్ అవబోతున్న విషయం తెలిసిందే. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా మొదటి బొమ్మ పడేది ఆంధ్రాలోనే అని తెలుస్తుంది. మాములుగా స్టార్ సినిమాలు ప్రీమియర్స్ రిలీజ్ కు ఒకరోజు ముందు యూఎస్ లో పడతాయి. అయితే సరిలేరు నీకెవ్వరు విషయంలో మాత్రం ఏపిలో మొదటి ఆట పడుతుంది. 

 

ఏపి ప్రభుత్వం ఆ సినిమాకు వారం రోజుల పాటు 6 షోలకు అనుమతి ఇచ్చారు. ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు మొదటి షో పడబోతుందట. సరిలేరు నీకెవ్వరు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేష్ సర్ ప్రైజ్ చేయబోతున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మాములుగా సినిమా ఎలా ఉంది అన్నది ఓవర్సీస్ నుండి వచ్చిన టాక్ ను బట్టి తెలుస్తుంది. కాని సరిలేరు నీకెవ్వరుకి మాత్రం ఏపిలో మొదటి షో పడుతుంది కాబట్టి అక్కడ నుండి మొదటి టాక్ వచ్చేస్తుంది.

 

మహేష్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ సినిమాతో పండుగ ముందు డబుల్ ధమాకా ఇచ్చేందుకు వస్తున్నాడు సూపర్ స్టార్. సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ పర్ఫార్మెస్ కూడా సినిమాకు హెల్ప్ అవనుంది. మరి సరిలేరు నీకెవ్వరు మొదటి షో నుండి ఎలాంటి సెన్సేషన్స్ సృష్టిస్తుందో చూడాలి. తెలుగు రెండు రాష్ట్రాల్లో సరిలేరు నీకెవ్వరు హంగామా మొదలైంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరు మరోసారి కాలర్ ఎగురవేసేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే సినిమా పక్కా అంచనాలను అందుకునేలా ఉందని అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: