సంక్రాంతి వస్తుంది అంటే టాలీవుడ్ కు పెద్ద పండగ వచ్చినట్టే అని చెప్పాలి. సంక్రాంతి పండక్కు టాలీవుడ్ హీరోల సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. రేపటి రోజున సరిలేరు నీకెవ్వరూ సినిమా రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా చుట్టూ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. పక్కా ఎంటర్టైన్మెంట్ గా సినిమా రాబోతున్నది. మహేష్ బాబు కామెడీ అదిరిపోతోంది అంటున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ, ఎందుకో అభిమానులు తెలియని టెన్షన్ పడుతున్నారు. భారీ హైప్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటమే ఇందుకు కారణం కావొచ్చు. ఈ సినిమా రిలీజైన మరుసటి రోజున బన్నీ అల వైకుంఠపురంలో సినిమా రిలీజ్ కాబోతున్నది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకుడు. పైగా సాంగ్స్ ఇప్పటికే మోతమోగిపోతున్నాయి. ఈ రెండు చాలా పెద్ద సినిమాలు. పోటాపోటీగా రాబోతున్నాయి. ఒక్క రోజు గ్యాప్ తో వస్తున్న సినిమాలు కావడంతో ఆసక్తి నెలకొన్నది.
అయితే, ఇప్పుడు ఓ విషయం తెలియాల్సి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు సినిమాలకు అదనంగా రెండు షోలు వేసుకునే అవకాశం జగన్ ప్రభుత్వం. జనవరి 11 నుంచి సరిలేరు నీకెవ్వరూ సినిమాకు, జనవరి 12 నుంచి అల వైకుంఠపురంలో సినిమాకు అదనంగా షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది. జనవరి 17 వ తేదీ వరకు ఈ అవకాశం కల్పించింది.
ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్పెషల్ షోలు వేసుకోవడానికి కెసిఆర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విశేషం. అందనంగా ఒక్క షో కాకుండా రెండు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది గ్రేట్ అని చెప్పాలి. అయితే, ఈ రెండు సినిమాలకే కెసిఆర్ ఇలాంటి అనుమతులు ఇస్తారా లేదంటే జనవరి 15 వ తేదీన రిలీజ్ కాబోతున్న కళ్యాణ్ రామ్ సినిమా ఎంత మంచి వాడవురా సినిమాకు కూడా అనుమతి ఇస్తారా చూడాలి.