సరిలేరు నీకెవ్వరూ సినిమా రేపు రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  కామెడీ ఎంటర్టైనర్ గా, రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయం తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.  అయితే,  ఎంటర్టైన్మెంట్ భారీగా ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొన్నది.  


మహేష్ బాబు ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తనదైన యాక్షన్ ను చూపించబోతున్నారు.  ఈ యాక్షన్ తరువాత మహేష్ బాబు ట్రైన్ ఎపిసోడ్ తో అదరగొట్టబోతున్నారు ట్రైన్ ఎపిసోడ్ లో ఎంటైర్ టీం మొత్తం ఉండబోతున్నది.  ఈ ఒక్క సీన్ అరగంట పాటు నవ్వులు పూయించబోతున్నట్టు తెలుస్తోంది.  కామెడీ డోస్ ఎక్కువైనా కొంత ఇబ్బందే అని చెప్పాలి.

 
మహేష్ బాబు ఫైట్స్ తో పాటుగా కామెడీ కూడా అద్భుతంగా చేశారని టాక్ వినిపిస్తోంది.  దీనిని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా రూ. 100 కోట్లు చేసింది.  హిట్ టాక్ రావాలి అంటే ఖచ్చితంగా రూ. 110 కోట్లు షేర్ వసూళ్లు సాధించాలి.   సంక్రాంతి సీజన్ కావొచ్చు.  ఈ సినిమాతో పాటుగా అల్లు అర్జున్ సినిమా కూడా రిలీజ్ అవుతుండటంతో వసూళ్లు ఎలా ఉంటాయా అని ఎదురుచూస్తున్నారు.  


మొదటి రోజు వసూళ్ల మీదనే దృష్టి పెట్టారు.  ఈ సినిమా మొదటి రోజు కనీసం రూ. 40 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు సాధిస్తుందేమో అని చూస్తున్నారు.  ఈ షేర్ వస్తేనే మహేష్ బాబు సినిమా బయటపడుతుంది.  దర్బార్ సినిమా మంచి టాక్ వచ్చినా, మూడో రోజున ఈ  సినిమాను థియేటర్ల నుంచి తీసేస్తున్నారు.  కారణం టాలీవుడ్ సినిమాలు ఉండటమే.  దర్బార్ 75 శాతం సినిమా థియేటర్ల నుంచి బయటకు వెళ్తుంది.  మరి జనవరి 12 న ఏం చేస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: