సూపర్ స్టార్ మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ రష్మిక మందన్న. కన్నడలో కిరాక్ పార్టీతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక శనివారం రిలీజ్ అవుతున్న ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇక వెరైటీగా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ డాటర్ సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలతో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది రష్మిక. ఈ ఇంటర్వ్యూలో రష్మికతో ఆ ఇద్దరు పాపలు చేసిన అల్లరి అలరించింది.

 

నాన్నతో కలిసి పనిచేయడం ఎలా అనిపించిందని సితా పాప అడుగగా.. మహేష్ బాబు లాంటి స్టార్ తో నటించడం ఇదే మొదటిసారి.. మొదట్లో భయపడినా సెట్ లో చాలా సరదాగా సాగిపోయింది. నేను సెట్ లో చాలా అల్లరి చేసేదాన్నని అనగ.. సితార కలుగచేసుకుని మీరు టాం బాయ్ లాంటి వారు కదా అనేసింది. తన కెరియర్ లో ఇదే పెద్ద సినిమా.. స్టార్ కాస్ట్ కూడా భారీగా ఉంది.. పైకి ధైర్యంగా కనిపించినా లోపల భయమేసింది.. అయితే చిన్నగా అలవాటైందని అన్నారు రష్మిక. ఇక సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటని అడిగితే క్లైమాక్స్ అని చెబుతుంది రష్మిక. అయితే అదేంటో చెప్పాలని సితార రష్మికను అడిగింది.

 

అందుకు నేను క్లైమాక్స్ చెప్పనని.. యూట్యూబ్ ఛానెల్ కు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికి క్లైమాక్స్ తెలిసిపోద్దని అన్నది రష్మిక. డ్యాన్స్ కూడా బాగా చేశారని అడుగగా.. డ్యాన్స్ కోసం చాలా కష్టపడ్డాను.. ఈ సినిమాలో నేను కూడా డ్యాన్స్ చేశాను. మహేష్ సర్ తో డ్యాన్స్ చేయడం కష్టంగా అనిపించింది. సినిమాలో మైండ్ బ్లాంక్ సాంగ్ తర్వాత ఊపిరీఅడక బాబోయ్ అని కూర్చున్నారు కదా అని రష్మికను సితారను అడిగింది. అవును మీకెవరు చెప్పారని అన్నారు రష్మిక.

 

మొత్తానికి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మికతో సితార, ఆద్య చేసిన అల్లరి అందరిని సర్ ప్రైజ్ చేసింది. శనివారం భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సూపర్ మ్యూజిక్ అందించారు. అనీల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మించిన ఈ సినిమాలో విజయశాంతి కూడా నటించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: