తమిళ స్టార్
హీరో విజయ్ ,ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మాస్టర్. సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈ చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుండగా ప్రస్తుతం
చెన్నై లో కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈసినిమా ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ మరియు డిజిటల్ హక్కులను యునైటెడ్
ఇండియన్ ఎంటర్ ప్రైజెస్ ,
మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్ సంస్థలు 33.5కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారని సమాచారం.
విజయ్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం.
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటు ఆండ్రియా జెర్మియా , శంతన్ భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఇక సర్కార్ ,
బిగిల్ చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్లు కావడం తో
విజయ్ అక్కడ కూడా మంచి మార్కెట్ ను క్రీయేట్ చేసుకున్నాడు . కాగా
మాస్టర్ తెలుగు వెర్షన్ హక్కులను
యువ నిర్మాత ,
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,
కళ్యాణ్ రామ్ ల పీఆర్వో
mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు 8.5కోట్లకు దక్కించుకున్నాడని సమాచారం. ఇంతకుముందు బిగిల్ తెలుగు వెర్షన్ హక్కులను ఆయనే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
విజిల్ పేరుతో విడుదలైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 12కోట్ల షేర్ ను రాబట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో
మాస్టర్ ప్రేక్షకులముందుకు రానుంది.