తమిళ స్టార్ హీరో విజయ్ ,ఖైదీ ఫేమ్  లోకేష్  కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న  చిత్రం మాస్టర్. సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈ చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుండగా ప్రస్తుతం  చెన్నై లో కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు.  ఇటీవల విడుదలైన ఈసినిమా  ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క ఓవర్సీస్ థియేట్రికల్ మరియు డిజిటల్  హక్కులను  యునైటెడ్ ఇండియన్ ఎంటర్ ప్రైజెస్ , మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్  సంస్థలు  33.5కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారని సమాచారం.  విజయ్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. 
 
కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా  పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది.  వీరితో పాటు ఆండ్రియా  జెర్మియా , శంతన్  భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో  నటిస్తున్నారు.  కోలీవుడ్  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా  భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
 
ఇక   సర్కార్ , బిగిల్ చిత్రాలు   తెలుగులోనూ సూపర్  హిట్లు కావడం తో   విజయ్ అక్కడ కూడా మంచి మార్కెట్  ను క్రీయేట్ చేసుకున్నాడు .  కాగా మాస్టర్ తెలుగు వెర్షన్ హక్కులను  యువ నిర్మాత , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ల పీఆర్వో mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు 8.5కోట్లకు  దక్కించుకున్నాడని సమాచారం. ఇంతకుముందు బిగిల్  తెలుగు వెర్షన్ హక్కులను  ఆయనే  సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విజిల్ పేరుతో విడుదలైన ఈ చిత్రం  తెలుగు రాష్ట్రాల్లో 12కోట్ల షేర్ ను రాబట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో మాస్టర్ ప్రేక్షకులముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: