‘సరిలేరు నీకెవ్వరు' మ్యానియాతో మహేష్ అభిమానులు రేపటిరోజు గురించి ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ మహేష్ అభిమానులకు మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది అంటూ ఇప్పటికే అనేకసార్లు ఈ మూవీ నిర్మాతలు చెపుతూ వచ్చారు.  

ముఖ్యంగా మహేష్సినిమా ప్రమోషన్ లో తన అభిమానుల కోసమే చేసిన పక్కా మాస్ సినిమాఅని చెపుతున్నాడు.    ఇది ఇలా ఉండగా ‘మాస్ ఎంబీ’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా 'మైండ్ బ్లాక్' పాటలో మహేష్ ఊర మాస్ గెటప్ స్టెప్పుల గురించి అదేపనిగా చెబుతు ఉండటంతో అభిమానుల్లో ఈ పాట మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ నిర్మాత అనీల్ సుంకర ట్వీట్ మరింత సంచలనంగా మారింది. 

'సరిలేరు’ లో మహేష్ తొలిసారిగా మాస్ క్రైమ్ చేశాడని ఈ పాట సినిమాలో డైలాగ్ మాదిరే 'నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్' అన్నట్లుగా ఉంటుందని మహేష్ అభిమానులకు చెపుతూ ఈ పాట వచ్చినపుడు మహేష్ అభిమానుల్ని థియేటర్ల యజమానులు కొంచెం చూసుకోవాలని లేకుంటే కష్టం అంటూ హెచ్చరికలు ఇస్తున్నాడు. అంతేకాదు    ఈ పాట చూస్తూ అభిమానులు మైమరిచిపోయి థియేటర్ల నుంచి కింద పడే ప్రమాదం ఉందని అందుకని వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలని నిర్మాత అనీల్ సుంకరమూవీ పై మరింత అంచనాలు పెంచేస్తున్నాడు.   

వాస్తవానికి మహేష్‌ కు మాస్‌ లో మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లలో వాళ్లను అలరించే సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఆలోటును రేపు విడుదల కాబోయే ‘సరిలేరు నీకెవ్వరు’ తీర్చి వేస్తుంది అని చేస్తున్న మితిమీరిన ప్రచారంతో అంచనాలు పెరిగి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో అంచనాలు అందుకోవడంలో ఈ మూవీలో ఎటువంటి చిన్న పొరపాటు జరిగి ప్రేక్షకులకు అసంతృప్తి కలిగితే భారీగా అంచనాలు తారుమారు అయ్యే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: