వరుసగా మూడు డిజాస్టర్ల తరువాత యంగ్
హీరో నితిన్ ప్రస్తుతం ఛలో ఫేమ్
వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ అనే చిత్రం లో నటిస్తున్నాడు. యూత్ ఫుల్
లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ
సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఇక ఈ
సినిమా టీజర్ ను ఈనెల 12న ఉదయం 10 గంటలకు విడుదలచేయనున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ
సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది
ఫిబ్రవరి 21న విడుదలకానుంది.
ఇదిలా ఉంటే గత ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకులముందుకు రాలేకపోయిన నితిన్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో రానున్నాడు. అందులో భాగంగా భీష్మ తోపాటు
నితిన్ ప్రస్తుతం మరో రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా వున్నాడు. అందులో
తొలిప్రేమ ఫేమ్
వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'రంగ్ దే' ఒకటి.
రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో
నితిన్ సరసన
కీర్తి సురేష్
హీరోయిన్ గా నటిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈచిత్రం జూలై లో విడుదలకానుంది.
ఇక ఈ సినిమాతో పాటు సాహసం ఫేమ్
చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో కూడా నితిన్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో
నితిన్ కు జోడిగా
రకుల్ ప్రీత్ సింగ్ , మలయాళ బ్యూటీ
ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై
ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం కూడా ఈ ఏడాది ద్వితీయార్థం లోనే విడుదలకానుంది. మరి ఈమూడు చిత్రాలతో నితిన్ హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.