టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. సినిమా ప్రకటన విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ వచ్చింది. ఎందుకంటే వరుస  బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతు... బాక్సాఫీస్ ని ఒక రేంజ్ లో షేక్  చేస్తున్న మహేష్ బాబు హీరోగా నటిస్తుండటం.. తాను తెరకెక్కించిన సినిమాలను మంచి విజయాలు సాధించేలా మలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి  కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం  కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బ్యూటీ క్వీన్  రష్మిక మందన నటిస్తోంది. ఇక పోతే ఈ సినిమాలో మరో హైలెట్ పాయింట్ ఏంటి అంటే... సరిలేరు నీకెవ్వరు సినిమాలో దాదాపు పదమూడేళ్ళ తరవాత టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తోంది. 

 

 

 

 అప్పట్లో అగ్ర కథానాయిక గా ఒక వెలుగు వెలిగిన విజయశాంతి ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే... ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో దాదాపు పదమూడేళ్ళ తరవాత ఒక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది . అయితే మహేష్ బాబు తో 30 ఏళ్ల క్రితం కొడుకు దిద్దిన కాపురం సినిమాలో నటించింది విజయశాంతి. 30 ఏళ్ల తర్వాత ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్లీ వీరిద్దరి కాంబోలో చూడబోతున్నారు ప్రేక్షకులు. అంతేకాదండోయ్.. విజయశాంతి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తూ మొదటగా నటించింది మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సరసనే... ఇక ఆనాడు కృష్ణ సరసన నటించి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తే ఇప్పుడు కృష్ణ తనయుడు మహేష్ బాబు సరసన నటించిన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది విజయశాంతి. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. 

 

 

 తమ అభిమాన నటి అయిన విజయశాంతి మళ్లీ సినిమాల్లోకి వస్తే బాగుండు అని గత 13 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అభిమానుల  కోరిక నెరవేరబోతోంది. మరోసారి విజయశాంతి సినిమాల్లోకి వెండితెరపై తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధమైయింది. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది విజయశాంతి. కథను మలుపు తిప్పే పాత్ర లో విజయశాంతి నటిస్తోందని తెలుస్తోంది. విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సరిలేరు నీకెవ్వరు సినిమాలోని పవర్ఫుల్ పాత్ర సరైనది అని భావించిన విజయశాంతి... ఈ సినిమాతో 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. విజయశాంతి ని సినిమాల్లో నటింప  చేయాలని ఎంతో మంది దర్శకులు ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి అది ఒక్క  దర్శకుడు అనిల్ రావిపూడి సాధ్యమైంది. సరిలేరు నీకెవ్వరు సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: