దర్శకుడు త్రివిక్రమ్ హీరో బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో బాలకృష్ణ అనగానే నందమూరి బాలకృష్ణ అనుకోకండి... బిగ్గాస్ 1 బుల్లితెర ద్వారా పరిచయమైన ఆదర్శ బాలకృష్ణ పరిచయమయ్యాడు. ఆ షో వల్ల ఆయనకు చాలా క్రేజ్ వచ్చింది. దాంతో ఒకేసారి టాలీవుడ్ సినిమాలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కాకపోతే తనకి నచ్చిన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గతంలో చేసిన 'అరవింద సమేత' గురించి ప్రస్తావించాడు. "త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో 'అరవింద సమేత'లో నటించాను. అయితే నేను చేసిన సీన్ ను ఫైనల్ ఎడిటింగ్ లో లేపేశారు. ఎన్టీఆర్ కాంబినేషన్లో నేను చేసిన ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి సీన్ లేపేయడం నాకు చాలా బాధాను కలిగించింది. త్రివిక్రమ్ గారి దగ్గర కూడా నా ఆవేదనను వ్యక్తం చేశాను. తరువాత సినిమాల్లో ఆయన నాకు మంచి పాత్రను ఇస్తారనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. అయితే త్రివిక్రమ్ మరి మాట నిలబెట్టుకుంటాడా లేదా అన్నది చూడాలి. ఇక ఇదిలా ఉంటే అరవింద సమేత చాలా పెద్ద సినిమా అయిందని అందులో చాలా సీన్లే కట్ చేశారని అప్పట్లో ఒక పుకార్ అయితే షికారు చేసింది. మరి నిజ నిజాలు ఏమైనప్పటికీ కొంత మంది చిన్న చిన్న ఆర్టిస్టులు వారికి అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఇలా చేస్తే వారి బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.
రంగమార్తాండ మరాఠీలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను క్రిష్ణవంశీ తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అదీగాక చాలా రోజుల తర్వాత రమ్యక్రిష్ణ క్రిష్ణ వంశీ సినిమాలో నటించడం మరో ఆసక్తికర అంశం. రమ్య క్రిష్ణ, ప్రకాష్ రాజ్ ల కాంబినేషన్ లో వచ్చిన చాలా చిత్రాలు మంచి విజయం సాధించాయి. అలాగే ఈ సినిమా కూడా విజయవంతం అవుతుంద అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ప్రకాష్ రాజ్ ఎక్కువగా కలుగజేసుకుంటున్నాడట. ప్రకాష్ రాజ్ నటిస్తూనే స్క్రిప్ట్ విషయంలో మరియు స్క్రీన్ ప్లే విషయంలో ఒక సహాయ దర్శకుడి మాదిరి గా కృష్ణవంశీ కి హెల్ప్ చేస్తున్నాడట.