ఈ రోజుల్లో ఒక సినిమా ఎంత మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కించారో  అంతే మంచి కాన్సెప్ట్ తో దానిని ప్రమోషన్ చేసుకోవాలి ..  సినిమా బడ్జెట్ కి దాదాపు సగం భాగం వరకూ ప్రమోషన్లో పెడుతున్నారు అంటే పరిస్థితి ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.  

 

 

కాబట్టి ఏ సినిమాకైనా ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ గా అయిపోయింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు విడుదలకు సిద్ధమైంది, ఈ సినిమా ఎలా ఉండొచ్చు అని ప్రేక్షకుల్లో జోరుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి . సరిలేరు నీకెవ్వరు ప్రచార కార్యక్రమాలతో బిజీ అయిపోయారు హీరో మరియూ చిత్రా బృందం .  ఇంటర్వ్యూలు ఇస్తూ ..  సినిమా గురించి విశేషాలు వెల్లడిస్తూ .. సినిమా మీద పెంచే ప్రయత్నం చక్కగా చేస్తున్నారు . ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబు పాపులర్ టీవీ సీరియల్ తూర్పు పడమర లో కనిపిస్తారు అని తెలుస్తోంది . జీ తెలుగు చానల్లో ప్రసారం అవుతుంది ఈ సీరియల్ ప్రోమో కి సంబంధించి రీసెంట్గా తాజ్ డెక్కన్ హోటల్లో షూటింగ్ కూడా పూర్తయింది.  మహేష్ బాబు తో పాటుగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా పాల్గొన్నాడు.

 

 

 సీరియల్ ఎపిసోడ్ లో  మహేష్ బాబు అతిథిగా హాజరు అవుతారా లేక తూర్పు పడమర నటీనటులతో చిట్ చాట్ చేస్తారా  అనేది ఇన్ఫర్మేషన్ ఇంకా అందాల్సి ఉంది.  బుల్లితెర ప్రేక్షకుల కోసం మహేష్ బాబు చేస్తున్న వినూత్న ప్రయోగం ఇది  అని చెప్పవచ్చు . అల్లు అర్జున్ కొత్త సినిమా ప్రమోషన్ కోసం హిందీ వాళ్ళకి  ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటే ..  మహేష్ బాబు ఫ్యామిలీ ఆడవాళ్ళకి దగ్గరవడం,  వారితో సినిమాకి ఎక్కువ కలెక్షన్లు రప్పించడం కోసం సీరియల్స్ ని టార్గెట్ చేస్తూ ప్రమోషన్స్ లో ఒక కొత్త ట్రెండ్  సృష్టించారు ..   ఈ దెబ్బతో మహేష్ బాబు ప్రమోషన్ ల విషయం లో  అల్లు అర్జున్ ని చిత్తుగా ఓడించినట్టు  అయ్యింది అని మహేశ్ ఫాన్స్ అనుకుంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: