తెల్లారితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది . ఈ నేపథ్యంలో మహేష్ బాబు చేసినటువంటి ప్రతీ పని ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ ని .. ఫిమేల్ ఆడియన్స్ ని దగ్గర చేసుకోవడం కోసం తనదైన శైలిలో ప్రమోషన్లు చేస్తున్నారు .
ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా ప్రోమోలు ట్రైలర్లు టీచర్లు చూస్తుంటే ఈ సినిమాతో మహేష్ అనిల్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నారు అందరూ .. అయితే మహేష్ బాబుతో కలిసి పని చేయడం మర్చిపోలేని అనుభవం అని అనిల్ షూటింగ్లో జరిగిన ఆసక్తికర సంఘటనల గురించి చెప్తున్నారు . రీసెంట్ గా ఈ సినిమా బృందం ఒక పెద్ద ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు .. అందులో మహేశ్ - అనిల్ అనేక విషయాలు వెల్లడించారు . అనిల్ రావిపూడి కి కోపం వస్తే ఇతరులపై అరవడం కేకలు పెట్టడం లాంటివి చేయకుండా, దానికి బదులుగా కోపాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఏదో ఒకటి తింటూ పాజిటివ్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేస్తారని తెలిపారు మహేష్ బాబు. తానే స్వయంగా ఈ విషయాన్ని గమనించానాని దాని గురించి ఏడిపిస్తూ ఉండేవాడినని మహేష్ చెప్పుకొచ్చారు . మహేష్ తో వర్క్ చేయటం ఏ డైరెక్టర్ కి అయినా సంతోషంగానే ఉంటుంది అంటూ అనిల్ చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి. మహేష్ కూడా అనిల్ రావిపూడి వర్క్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
మహేష్ బాబు చేసినటువంటి ఆ షాకింగ్ ఇన్సిడెంట్ ఏమిటా అని ఎదురు చూస్తున్నారు కదూ, మహేష్ ఇప్పుడు సినిమా విడుదలకు ఒక రోజు ముందు ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు అని దాని ప్రకారం విడుదల రోజు ఆయన ఇక్కడ ఉండకపోవచ్చు అని అందుకే మూడు వారాల ముందు నుంచే ఇంటర్వ్యూలు సినిమాకి సంబంధించి అన్ని వ్యవహారాలు అనిల్ రావిపూడి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర అప్పచెప్పి మరీ ఆయన విదేశాలకు వెళ్లబోతున్నారు అనే వార్త ఒకటి వైరల్ అవుతోంది .. ఇది ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అయితే మహేష్ బాబు ఇంకా అధికారికంగా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు.