‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కనిపించబోతున్న విషయాన్ని తెలియచేసి అందరికి షాక్ ఇచ్చాడు హీరో మహేశ్ బాబు . అయితే ఈ మూవీలో కృష్ణ ఎంట్రీ ఎలా ఉండబోతోంది అన్న విషయం మాత్రం సస్పెన్స్ అంటూ ఆ మూవీ విడుదల అయ్యేవరకు ఓపిక పెట్టమని మహేష్ అభిమానులకు సూచనలు చేసాడు. ఈ దెబ్బతో ఈ సినిమా మీద విపరీతమైన హైప్ పెరిగిపోయింది .

 

 

ఇదొక్కటే కాదు ఈ సినిమా గురించి అందరూ డిస్కస్ చేసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మహేశ్ బాబు వరసగా హిట్ లు కొడుతున్న హీరో శ్రీమంతుడు , భరత్ అనే నేను , మహర్షి ఇలా వరస హిట్ లతో కుమ్మెస్తున్నాడు. ఈ తరుణం లో మహేశ్ కొత్త సినిమా సరిలేరు నీకేవ్వరు మీద ప్రేక్షక లోకం తో పాటు డిస్ట్రిబ్యూటర్ లు కూడా విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు . మరి ఈ సినిమా విషయం లో ఏ రేంజ్ లో బిజినెస్ జరిగిందో చూశాం మనం. మహేశ్ కెరీర్ లోనే అత్యంత ఎక్కువ స్థాయి లో అమ్ముడుపోయిన సినిమా ఇది . ఓవర్ సీస్ లో కూడా మహేశ్ కోసం డిస్ట్రిబ్యూటర్ లు ఎగబడ్డారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు .   ఈ మూవీ నిడివి 2 గంటల 43 నిముషాలు అని అంటున్నారు.

 

 

బయటకు వచ్చిన సెన్సార్ టాక్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో 39 నిముషాల ట్రైన్ ఎపిసోడ్ హిలేరియస్ కామెడీ తో ఉంటె సెకండ్ హాఫ్ లో 15 నిముషాల ఎలుక ఎపిసోడ్సినిమా ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుంది అని అంటున్నారు. అలాగే కమెడియన్లు వెన్నెల కిషోర్ సుబ్బరాజులు సెకండాఫ్ లో చేసే కామెడీమూవీ ద్వితీయార్ధంలో వచ్చే విజయశాంతి ఎమోషనల్ సీన్స్ ఈ మూవీకి హైలెట్ అని అంటున్నారు.   మరి ఇన్ని హంగులు ఉండడం తో సరిలేరు మీద అంచనాలు పెరగడం లో తప్పు లేదు అయితే చిత్రా బృందం ఈ అంచనాలు అందుకోగలదా అనేది ప్రశ్న ! 

మరింత సమాచారం తెలుసుకోండి: