సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడిల తొలి కలయికలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండగా, ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హరితేజ, సంగీత, రావురమేష్, రఘు బాబు, జయప్రకాశ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్నారు. మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు ఫోటోగ్రఫిని అందిస్తున్నాడు. 

 

ఇకపోతే ఈ సినిమానుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ కు మహేష్ ఫ్యాన్స్, ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం జరిగింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రోమోలను బట్టి చూస్తే, సినిమాలో రష్మిక, విజయశాంతిలతో పాటు సంగీత పాత్ర కూడా చాలా బాగుండేలా కనపడుతోంది. ఈ సినిమాలో ఆమె రష్మిక తల్లిపాత్రలో నటిస్తున్నట్లు టాక్. ముఖ్యంగా రష్మికతో కలిసి ఆమె ట్రైలర్ లో పలికిన నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే డైలాగ్ తో పాటు, మియావ్ మియావ్ పిల్లి, మిల్క్ బాయ్ తో పెళ్లి అనే డైలాగ్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందనలభిస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో సంగీత పాత్ర కూడా చాలా హైలైట్ గా ఉంటుందని, 

 

అలానే ఆమె తన మ్యానరిజమ్ లో పలికే డైలాగ్స్ సినిమాకే పెద్ద హైలైట్ గా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా అనిల్ రావిపూడి తనకు ఈ పాత్ర చెప్పినపుడు నటించడానికి ఒప్పుకున్నానని, అయితే చివరికి షూటింగ్ చేయడానికి వచ్చినపుడు పాత్రలో ఎంతో ఫన్ ఉందని అర్ధం అయిందని, ఆ సీన్స్ లో నటించడానికి రష్మికతో పాటు తాను కూడా కొంత ఇబ్బంది పడ్డట్లు మొన్నటి ఈ సినిమా ప్రత్యేక ఇంటర్వ్యూ లో భాగంగా సంగీత చెప్పారు. అయితే చివరికి సినిమా పూర్తి అయిన తరువాత డబ్బింగ్ సమయంలో తమ పాత్రలు చూసుకుంటే, నిజంగా ఎంతో సంతోషం వేసిందని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని ఆమె అన్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: