దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రస్తుతం లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ లో ఉన్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. తమిళ్ లో అయితే టాప్ స్టార్ హీరోలతో సమానంగా ఆమెకు కటౌట్లు కట్టేస్తూంటారు కూడా. ప్రస్తుతం నయనతార తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన దర్బార్ సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో నయన్ చేసిన పాత్ర గురించి కాకుండా ఈ పాత్ర ఆమె ఎలా ఒకే చేసిందా అనే సైటైర్లు పడుతున్నాయి. దీనికి ఓ కారణం లేకపోలేదు.

 

 

మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో నయనతార మాట్లాడుతూ.. 2005లో సెన్షేషనల్ హిట్ అయిన మురుగదాస్ సినిమా గజినీ సినిమా గురించి కంట్రవర్సీ కామెంట్లు చేసింది. ఆసినిమాలో అనవసరంగా నటించానని బాహాటంగానే చెప్పింది. గజినీ సినిమా ఒప్పుకోవడం నా కెరీర్ లోనే తీసుకున్న చెత్త డెసిషన్ అని చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో నా పాత్ర గురించి మొదట మురుగుదాస్ చెప్పిన విధానం వేరు సినిమాలో చూపించింది వేరు అని నిర్మొహమాటంగా చెప్పింది. కానీ.. అదే మురుగదాస్ తో 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు రజినీకాంత్ దర్బార్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో నయనతార క్యారెక్టర్ చూసిన ప్రేక్షకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

 

 

మంచి కంటెంట్, పాత్ర ఉన్న గజినీ సినిమాలో తన పాత్ర గురించే అంత అసహనం వ్యక్తం చేసిన నయనతార దర్బార్ లో పాత్రకు ఎలా ఒకే చెప్పిందనే విమర్శలు వస్తున్నాయి. కేవలం రజినీకాంత్ క్రేజ్ గురించే దర్బార్ యాక్పెస్ట్ చేసిందా అంటే నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పైగా సినిమాకు 5కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటోంది కాబట్టి డబ్బు కోసం ఈ సినిమా చేసిందా అనే కౌంటర్లు వస్తున్నాయి. మరి నెటిజన్ల విమర్శలకు నయనతార ఏం సమాధానం చెప్తుందో చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: