ఏపీ రాజధాని అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన సెగ టాలీవుడ్ స్టార్స్ ను గట్టిగా తాకుతోంది. రోజు రోజుకి ఈ సెగ ఇంకా ఉధృక్తం అవుతోంది. రైతులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తూ అవస్థలు పడుతుంటే అసలు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుండి ప్రముఖులు ఏ ఒక్కరు స్పందించడం లేదని చాలా మంది దుమ్మెత్తిపోస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్స్ అమరావతికి మద్దతుగా మాట్లాడుకుంటే ఏపీలో వారి సినిమాలను ఆడనిచ్చేది లేదు అంటూ రైతులు ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా హైదరాబాద్ లో టాలీవుడ్ హీరోల ఇళ్ల ముందు ధర్నాలు చేసేందుకు అమరావతి ఆందోళనకారులు సిద్దం అయ్యారు. ఈ రోజు మహేష్ బాబు ఇంటి ముందు కొందరు స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. 

 

ఏపీ రాజధానిగా అమరావతి ఉండాల్సిందే అంటూ మహేష్ బాబు ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకోవడంతో అక్కడ పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. కేవలం మహేష్ బాబుకు మాత్రమే కాకుండా 19వ తారీకు వరకు వరుసగా హైదరాబాద్ లోని ఫిల్మ్ స్టార్స్ ఇళ్ల ముందు ధర్నాలు చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రకటించారు. అందుకు తగ్గ ప్రణాళిక ను సిద్దం చేసుకున్నారు.

 

10వ తారీకు మహేష్ బాబు ఇంటి ముందు ధర్నా.. 11వ తారీకున అల్లు అర్జున్ ఇంటి ముందు.. 12వ తారీకు చిరంజీవి ఇంటి ముందు.. 13వ తారీకు బాలకృష్ణ.. 14వ తారీకు ఎన్టీఆర్ ఇంటి ముందు.. 15వ తారీకు మోహన్ బాబు ఇంటిముందు.. 16వ తారీకు మా అధ్యక్షుడు నరేష్ ఇంటి ముందు.. 17వ తారీకు ప్రభాస్ ఇంటి ముందు.. 18వ తారీకున నాగార్జున ఇంటి ముందు మరియు 19వ తారీకున వెంకటేష్ ఇంటి ముందు ధర్నాలు చేయబోతున్నట్లుగా విద్యార్థి సంఘం నాయకులు ప్రకటించారు. మరి ఈ విషయమై టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికైనా స్పందిస్తారో చూడాలి. అయితే రీసెంట్ గా ఈ విషయంలో హీరో నారా రోహిత్, అలాగే ప్రముఖ పాప్ సింగర్ స్మిత అమరావతి రైతులకు అండగా ఉంటామని మేము మీ తరపున పోరాటం చేస్తామని మద్దతు తెలిపారు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: