టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తాను నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాపై మంచి నమ్మకంతో ఉన్నారు. తన సినిమాలను మంచి కమర్షియల్ హంగులతో చిత్రీకరించే యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి, భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నారు. 

 

ఇక ఇటీవల ఈ సినిమా నుండి దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్, అలానే థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి, ఫ్యాన్స్ నుండి అలానే సాధారణ ప్రేక్షకులు నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. అయితే మహేష్ బాబుతో పాటు యావత్ ఈ సినిమా యూనిట్ మొత్తం కూడా సినిమా సక్సెస్ పై ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తోంది. మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో నటుడు సత్యదేవ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో నిర్వహించిన యూనిట్ సభ్యులు, అవకాశం ఉన్నంతవరకు తమ సినిమాని బాగా ప్రమోట్ చేశారనే చెప్పాలి. ఇకపోతే సినిమాలో మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతో మెచ్చుకునే మంచి సీన్స్ ఉన్నాయని మహేష్, అనిల్ నిన్నటి ఒక ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. 

 

ఇక ముఖ్యంగా ఇంటర్వెల్ తరువాత ప్రారంభం అయ్యే ఫస్ట్ సీన్ ని మాత్రం మిస్ అవ్వొద్దని, కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ వంటివి తీసుకునిస్ సెకండ్ హాఫ్ మొదలయ్యే లోపే థియేటర్లోకి వచ్చేయండని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే ఆ సీన్ మిస్ అయితే సినిమా చాలావరకు అర్ధం కాదని వారిద్దరూ చెప్పారు. అయితే మహేష్, అనిల్ అంతిదిగా ఆ సీన్ గురించి చెప్పడంతో ఆ సీన్ ఏమై ఉంటుందబ్బా అంటూ అప్పుడే కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో చర్చలు మొదలెట్టేశారు. ఇప్పటికే రెండు వరుస విజయాలు అందుకుని దూసుకుపోతున్న మహేష్, ఈ సినిమాతో ఎంత మేర సక్సెస్ ని అందుకుంటారో చూడాలి......!!

 

మరింత సమాచారం తెలుసుకోండి: