తెలుగు సినీ పరిశ్రమలో హీరోలందరూ కలిసుండాలని అభిమానులు.. అభిమానులు అందరూ కలిసి ఉండాలని హీరోలు ఎప్పుడూ కోరుకుంటూ ఉంటారు. అలాంటి హీరోలందరూ ఓ వేదికపై కనిపిస్తే ఏ అభిమానికైనా పండగే. అలాంటి అరుదైన సంఘటనే 15 ఏళ్ల క్రితం జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో న్యూ జనరేషన్ హీరోలందరూ కలిసి ఉన్న ఆ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో మోస్ట్ వైరల్ పిక్ గా తెగ చక్కర్లు కొడుతోంది. ఆ పిక్ ను అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

 

 

 ‘ఇంటర్నెట్ లో సడన్ గా కనిపించిన.. వైరల్ అయిన పిక్’ అంటూ తన వాల్ లో రాసుకుని ఆ ఫోటోకి సంబంధించిన జ్ఞాపకాల్ని చెప్పుకున్నాడు. ఈ ఫోటోలో తనతో పాటు మెగాస్టార్ చిరంజీవితో కలిసి దర్శకుడు జయంత్ సి పరాన్జీ, సూపర్ స్టార్ మహేశ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, లవర్ బాయ్ తరుణ్, సంగీత సంచలనం దేవీశ్రీ ప్రసాద్, జెమినీ కిరణ్ ఉన్నారు. 2004లో మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా, ఎంబీబీఎస్ సినిమా సమయంలోని ఆ పిక్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

 

 

ఇండస్ట్రీలోని అందరి హీరోలతో చిరంజీవి ఎంతో సరదాగా మెలుగుతూంటారు. చిరంజీవి అంటే కూడా అందరికీ గౌరవం ఉంటుంది. అందులో భాగంగానే వీళ్లందరూ కలిసి ఇలా ఓ ఫొటో దిగారు. అయితే.. ఈ పిక్ షూటింగ్ సమయంలోనిదా.. లేక సినిమా విజయోత్సవంలో భాగంగా దిగారో అనేది తెలియలేదు. కానీ.. చూసేందుకు ఎంతో ముచ్చటగా ఉంది. నెటిజన్ల నుంచి కూడా ఈ పిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘ఈ పిక్ పోస్ట్ చేయడం సంతోషంగా ఉంది’, ‘నైస్ పిక్’ అంటూ రిప్లై ఇస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

This suddenly popped up on the net! #NeverSeenBefore #FlashbackFriday

A post shared by Sumanth (@sumanth_kumar) on

మరింత సమాచారం తెలుసుకోండి: