టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు రేపు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, రత్నవేలు ఫోటోగ్రఫిని, తమ్మిరాజు ఎడిటింగ్ ని అందించారు. ఒకప్పటి నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి అర్ధరాత్రి యుఎస్ఏ, యూఏఈ, దుబాయ్ వంటి దేశాల్లో ముందుగా షోలు వేయడం జరిగింది. 

 
ఇక ఆ షోల నుండి వస్తున్న టాక్ ని బట్టి చూస్తే, ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా మంచి టాక్ లభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాల సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న సూపర్ స్టార్, ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ విజయాలు అందున్నాడని అంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ ఈ సినిమాని తెరకెక్కించాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో ఎంటర్టైన్మెంట్ తో సాగే ఈ సినిమా, ఇంటర్వెల్ సమయానికి మంచి రసపట్టుకి చేరుతుందని, ఇక సెకండ్ హాఫ్ చాలావరకు మంచి యాక్షన్, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో సాగి, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోతుందని అంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని ల్యాగ్స్, అలానే హీరోయిన్ రష్మిక కొంత అతిగా చేసే సన్నివేశాలు తప్పించి దాదాపుగా సినిమాలో ఎటువంటి మైనస్ లు లేవని అంటున్నారు. మరి  ఈ సినిమాలో ప్లస్ లు, మైనస్ లు ఎలా ఉన్నాయో  ఇప్పుడు చూద్దాం....
 
ప్లస్ పాయింట్స్ : -

మహేష్ బాబు
కథ, కథనం
విజయశాంతి
యాక్షన్ ఎపిసోడ్స్
సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ : -

హీరోయిన్ అక్కడక్కడా చేసిన అతి
సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్
 
ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి మొదలైపోయినట్లు తెలుస్తోంది. ఇక రేపటి నుండి థియేటర్స్ వద్ద ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల సందడి మాములుగా ఉండదని తెలుస్తోంది. అయితే ఓవర్ ఆల్ గా ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: