సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-రష్మిక మందన్న జంటగా నటించిన సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా భారీ స్థాయిలో ఈ శనివారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన ఈ సినిమాకు ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి బాగా హైప్ తీసుకు వచ్చాయి. అంతేకాదు స్వయంగా మహేష్ బాబు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాకు సంబంధించిన విశేషాలు ప్రేక్షకులతో పంచుకొని సినిమాని బాగా చేరువ చేశాడు. 

 

ఇక గత రెండేళ్ళుగా ఎక్కువగా సీరియస్ గా ఉండే సినిమాలు చేసిన మహేష్ 'శ్రీమంతుడు'.. 'భరత్ అనే నేను'.. 'మహర్షి' ఇలా అన్నీ సినిమాలు సామాజిక అంశంతో బలమైన కథ ని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అందుకే ఈ సారి వీటన్నిటికి భిన్నంగా పోకిరి, 'దూకుడు' మాదిరి ఒక ఎంటర్టైనర్.. ఈ ట్రెండ్ కు తగ్గట్టు చెయ్యాలనే ఆలోచనతో సరిలేరుకి సై అన్నాడు. 'మహర్షి' షూటింగ్ సమయంలో అనిల్ రావిపూడి సరిగ్గా అలాంటి కథే చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో కొత్త మహేష్ బాబును చూస్తారని చిత్ర యీనిట్ ముందునుంచి చెప్తున్నట్టుగానే సూపర్ స్టార్ చాలా కొత్తగా ఉన్నాడట. 

 

యు.ఎస్ తో పాటు ఏ.పి లో స్పెషల్ షోస్ పడ్డాయి. ఈ సినిమాకి ఫ్యాన్స్ నుండే కాదు ప్రేక్షకులందరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. చాలా కాలానికి మహేష్ మాస్ ఎలిమెంట్స్ అండ్ కంప్లీట్ ఎంటర్టైనర్ తో వచ్చాడని సంక్రాంతికి సరిలేరు సరైన సినిమా అని అభిమానులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు మా అందరికి సంక్రాంతి సరిలేరు రిలీజ్ తోనే మొదలైందని చెప్పుకుంటున్నారట. ఇక ఈ మధ్య కాలంలో మహేష్ ని ఇలా చూడలేదని ఇంత కొత్తగా ఉన్న మహేష్ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఇక అసలు టాక్ ఏంటనేది ఒకరోజు గడిస్తే గాని చెప్పలేము.  ఇక ఇప్పటికే అభిమానుల దగ్గర్నుంచి వస్తున్న ఈ రెస్పాన్స్ మహేష్ బాబు కూడా ఊహించి ఉండరని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: